News December 27, 2024
2025లో గ్రహణాలు ఎప్పుడంటే!

రానున్న ఏడాదిలో 2 సూర్య, 2 చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. సంపూర్ణ చంద్రగ్రహణం మార్చి 14న ఏర్పడుతుంది. ఇది మన దేశంలో కనిపించదు. US, వెస్ట్రన్ యూరప్, ఆఫ్రికాలో దర్శనమిస్తుంది. మార్చి 29న ఏర్పడే పాక్షిక సూర్య గ్రహణం కూడా స్వదేశంలో కనిపించదు. Sep 7-8 మధ్య ఏర్పడే సంపూర్ణ చంద్ర గ్రహణం మాత్రమే భారత్లో కనిపిస్తుంది. Sep 21న పాక్షిక సూర్యగ్రహణాన్ని కూడా మనం చూసే అవకాశం ఉండదు.
Similar News
News December 28, 2025
వాళ్లకు దేశం కన్నా మతమే ఎక్కువ: అస్సాం CM

బంగ్లాదేశీయులకు దేశం కన్నా మతమే ఎక్కువని అస్సాం CM హిమంత బిశ్వ శర్మ అన్నారు. ‘ఇప్పుడు బంగ్లాదేశ్లో <<18624742>>దీపూ చంద్రదాస్<<>> పరిస్థితి చూస్తున్నాం. 20 ఏళ్ల తర్వాత అస్సాంలో ఇలానే జరిగే ప్రమాదం ఉంది. 2027 నాటికి అస్సాంలో బంగ్లా సంతతికి చెందిన మియా ముస్లింలు 40% ఉంటారు’ అని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ‘నాగరికత పోరాటం’గా హిమంత అభివర్ణించారు.
News December 28, 2025
ధోనీతో ఆడటం నా అదృష్టం: డుప్లెసిస్

CSKలో MS ధోనీ, స్టీఫెన్ ఫ్లేమింగ్ వంటి గొప్ప ప్లేయర్ల ఆధ్వర్యంలో ఆడటం తన అదృష్టమని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నారు. సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. CSKలో పదేళ్లు, JSKలో మూడేళ్లు ఆడానని, ఇదో గొప్ప ఫ్రాంచైజీ అని అన్నారు. ఇటీవల IPLకు డుప్లెసిస్ రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం సౌతాఫ్రికా T20 లీగ్లో జోబర్గ్ సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఉన్నారు.
News December 28, 2025
శబరిమల ఆలయం మూసివేత.. రీఓపెన్ ఎప్పుడంటే?

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో పవిత్ర మండల పూజ పూర్తయింది. శనివారం రాత్రి 10 గంటలకు హరివరాసనం పాడిన తర్వాత మండల పూజా కాలం ముగింపును సూచిస్తూ గుడిని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(TDB) తెలిపింది. మకరవిళక్కు పండుగ కోసం ఈ నెల 30న 5PMకు ఆలయం తెరుస్తామని చెప్పింది. మరోవైపు ఇప్పటిదాకా 30 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. ₹333 కోట్ల ఆదాయం టెంపుల్కు వచ్చింది.


