News December 15, 2024

గ్రూప్స్ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

image

వచ్చే ఏడాది మార్చి నాటికి గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నట్లు TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. ఇవాళ, రేపు జరగబోయే గ్రూప్-2 పరీక్షకు 5,51,000 మంది అప్లై చేసుకున్నారని తెలిపారు. TGPSC కేవలం సిలబస్ మాత్రమే ఇస్తుందని, అభ్యర్థులు తమకు ఇష్టమైన బుక్స్ చదువుకోవచ్చని చెప్పారు. గ్రూప్-2 పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయని పేర్కొన్నారు.

Similar News

News November 8, 2025

ఇజ్రాయెల్ PM అరెస్టుకు తుర్కియే వారెంట్

image

గాజాలో విధ్వంసం, నరమేధానికి కారణమంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అరెస్టుకు తుర్కియే వారెంట్ జారీచేసింది. ఆయనతో పాటు మంత్రులు కట్జ్, ఇతమాన్ బెన్ గ్విర్, ఇతర అధికారులతో మొత్తం 37 మందిని వారెంటులో చేర్చినట్లు ఇస్తాంబుల్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ దీన్ని ఖండించింది. తుర్కియే నిరంకుశ పాలకుడు ఎర్డోగన్ ప్రజలను మభ్యపెట్టే స్టంట్ ఇది అని విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ విమర్శించారు.

News November 8, 2025

పాపులేషన్ రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

ఆంధ్ర యూనివర్సిటీలోని పాపులేషన్ రీసెర్చ్ సెంటర్‌ 6 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డెమోగ్రఫి, పాపులేషన్ స్టడీస్, స్టాటిస్టిక్స్, బయోస్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, సోషియాలజీ, సోషల్ వర్క్, సైకాలజీ, ఆంత్రోపాలజీలో మాస్టర్ డిగ్రీ, M.Phil, PhDతో పాటు SET/SLET/NET అర్హత సాధించి ఉండాలి. వెబ్‌సైట్: https://www.andhrauniversity.edu.in/

News November 8, 2025

వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు – కలుపు నివారణ

image

వరి మాగాణుల్లో మొక్కజొన్న విత్తాక కలుపు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కిలో అట్రజిన్ 50% పొడి మందును కలిపి పంట విత్తిన 48 గంటలలోపు నేలంతా తడిచేట్లు పిచికారీ చేయాలి. వరి దుబ్బులు తిరిగి చిగురించకుండా 200 లీటర్ల నీటిలో లీటరు పారాక్వాట్ కలిపి విత్తే ముందు లేదా విత్తిన వెంటనే పిచికారీ చేయాలి. దీని వల్ల విత్తిన 20-25 రోజుల వరకు ఎలాంటి కలుపు రాదు. అట్రజిన్+పారాక్వాట్ కలిపి కూడా పిచికారీ చేయవచ్చు.