News December 15, 2024
గ్రూప్స్ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?
వచ్చే ఏడాది మార్చి నాటికి గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నట్లు TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. ఇవాళ, రేపు జరగబోయే గ్రూప్-2 పరీక్షకు 5,51,000 మంది అప్లై చేసుకున్నారని తెలిపారు. TGPSC కేవలం సిలబస్ మాత్రమే ఇస్తుందని, అభ్యర్థులు తమకు ఇష్టమైన బుక్స్ చదువుకోవచ్చని చెప్పారు. గ్రూప్-2 పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయని పేర్కొన్నారు.
Similar News
News January 24, 2025
మోసం చేసిన భార్య.. దిమ్మతిరిగే షాకిచ్చిన భర్త
ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన 5 నెలలకే తనను వదిలిపెట్టిన భార్యకు భర్త గట్టిగా బుద్ధి చెప్పాడు. రాజస్థాన్ కోటాకు చెందిన మనీశ్ మీనా తన భార్య సప్నను చదివించేందుకు భూమిని తాకట్టు పెట్టి రూ.15 లక్షల లోన్ తీసుకున్నాడు. సప్న 2023లో రైల్వేలో ఉద్యోగం సాధించింది. ఉద్యోగం లేదని భర్తను దూరం పెట్టింది. సప్నకు బదులు డమ్మీ క్యాండిడేట్ ఎగ్జామ్ రాశాడని మనీశ్ ఆధారాలు సమర్పించడంతో అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు.
News January 24, 2025
వార్నీ.. సేమ్ జెండర్ వ్యక్తుల వందలాది పెళ్లిళ్లు
థాయ్లాండ్లో ఒకేసారి వందలాది మంది LGBTQ జంటలు వివాహం చేసుకున్నాయి. సేమ్ సెక్స్ మ్యారేజ్కు చట్టబద్ధత కల్పించడంతో వారంతా వరుస కట్టి పెళ్లి చేసుకుంటున్నారు. దీంతో ఆగ్నేయాసియాలో ఈ చట్టం కలిగిన తొలి దేశంగా థాయ్లాండ్ నిలిచింది. 18 కంటే ఎక్కువ వయసున్న వారెవరైనా లింగంతో సంబంధం లేకుండా పెళ్లిచేసుకోవాలని. అలాగే వైఫ్ & హస్బెండ్ అనే పదాలను కూడా ‘స్పౌస్’గా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు.
News January 24, 2025
12 వికెట్లు తీసిన జడేజా
రంజీల్లో ఓ వైపు భారత స్టార్ బ్యాటర్లు విఫలమవుతుండగా సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన ఆల్రౌండర్ జడేజా అదరగొట్టారు. ఢిల్లీతో జరిగిన మ్యాచులో రెండు ఇన్నింగ్సుల్లో కలిపి ఏకంగా 12 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో 5, రెండో ఇన్నింగ్సులో 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. బ్యాటుతోనూ రాణించి 38 పరుగులు చేశారు. ఈ మ్యాచులో సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.