News May 4, 2024

కేసీఆర్ ఏ కూటమిలో చేరతారు?: సీఎం రేవంత్

image

కేసీఆర్ కేంద్రంలోని ఏ కూటమిలో చేరతారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా డిమాండ్ చేశారు. ‘కేసీఆర్ బీజేపీతో కలుస్తారని మేం ముందునుంచీ చెబుతున్నాం. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే. కేసీఆర్ వైఖరిని ప్రజలు ముందే గుర్తించారు. అందుకే వారిని దూరం పెట్టారు. రాష్ట్రానికి బీజేపీ తీరని ద్రోహం చేసింది. ఈ పదేళ్లలో ఆ పార్టీ రాష్ట్రానికి ఒక్క మేలైనా చేసిందా? రాహుల్‌‌ను పీఎంగా చూడాలనేదే ప్రజల ఆకాంక్ష’ అని తెలిపారు.

Similar News

News November 24, 2025

సిరిసిల్ల: యోగాలో మెరిసిన గిరిజన బిడ్డ

image

సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బంజేరు గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని బట్టు మనస్విని, ఒడిశా వేదికగా నవంబర్ 11-15 తేదీల్లో జరిగిన 4వ EMRS జాతీయ క్రీడా పోటీల్లో రజత పతకం సాధించి రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టింది. గతంలోనూ ఆమె నేషనల్ యోగా ఒలింపియాడ్, రాష్ట్ర స్థాయి పోటీల్లో కాంస్య పతకాలు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో పతకం సాధించిన మనస్వినిని పలువురు అభినందించారు.

News November 24, 2025

సిరిసిల్ల: యోగాలో మెరిసిన గిరిజన బిడ్డ

image

సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బంజేరు గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని బట్టు మనస్విని, ఒడిశా వేదికగా నవంబర్ 11-15 తేదీల్లో జరిగిన 4వ EMRS జాతీయ క్రీడా పోటీల్లో రజత పతకం సాధించి రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టింది. గతంలోనూ ఆమె నేషనల్ యోగా ఒలింపియాడ్, రాష్ట్ర స్థాయి పోటీల్లో కాంస్య పతకాలు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో పతకం సాధించిన మనస్వినిని పలువురు అభినందించారు.

News November 24, 2025

కర్నూల్ ప్రిన్సిపల్‌కు వోసా అప్రిషియేషన్ అవార్డు

image

వెలుగోడు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (VOSA) ఆధ్వర్యంలో ఆదివారం జెడ్‌పి హెచ్‌ఎస్‌లో జరిగిన VOSA’s Appreciation Award Function ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా కర్నూలు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్‌.నాగస్వామి నాయక్‌కు ప్రత్యేక వోసా అప్రిషియేషన్ అవార్డు అందజేశారు.