News August 17, 2024

మీ ఆధార్‌కు ఏ ఫోన్ నంబర్ ఇచ్చారు?

image

☞ UIDAI సైటులో మై ఆధార్ ఆప్షన్‌లోకి వెళ్లి ఆధార్ సర్వీసెస్‌ను ఎంచుకోవాలి
☞ అనంతరం వెరిఫై ఈమెయిల్/మొబైల్ నంబర్‌పై క్లిక్ చేయాలి
☞ ఆ తర్వాత ఆధార్, మొబైల్ నంబర్, క్యాప్చా టైప్ చేసి, ఎంటర్‌పై క్లిక్ చేయాలి
☞ ఎంటర్ చేసిన నంబర్ ఆధార్‌కు లింకై ఉంటే అయినట్లు సందేశం వస్తుంది. లేదంటే లింక్ కాలేదని డిస్‌ప్లే అవుతుంది.
☞ ఇలా మీ వద్ద ఉన్న నంబర్‌లలో దేనికి ఆధార్ కార్డ్ లింకై ఉందో తెలుసుకోవచ్చు

Similar News

News December 18, 2025

చలి ఎఫెక్ట్.. స్కూళ్ల టైమింగ్స్ మార్పు

image

TG: చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ఆదిలాబాద్(D) కలెక్టర్ స్కూల్ టైమింగ్స్‌లో మార్పులు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఉ.9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు ఉన్న టైమింగ్స్‌ను ఉదయం 9:40 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటలకు మార్చారు. అటు ఇతర జిల్లాల్లోనూ టైమింగ్స్ మార్చాలని పేరెంట్స్ కోరుతున్నారు.

News December 18, 2025

ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. రేపు కేంద్రమంత్రులతో భేటీ

image

AP: సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఆరుగురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. అమిత్ షా, నిర్మల, గడ్కరీ, సీఆర్ పాటిల్, హర్దీప్ సింగ్, సర్బానందలతో భేటీ అవుతారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులపై వారితో చర్చించి వినతి పత్రాలు అందజేస్తారు. రాత్రికి తిరిగి APకి చేరుకునే అవకాశం ఉంది. ఎల్లుండి అనకాపల్లిలో పర్యటించి మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

News December 18, 2025

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

image

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. వనస్థలిపురం పరిధిలోని సాహెబ్ నగర్‌లో ఉన్న 102 ఎకరాల భూమి తెలంగాణ అటవీశాఖదేనని తీర్పునిచ్చింది. ఈ భూమి తమదేనని కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా తాజాగా ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. 8వారాల్లో భూమిని నోటిఫై చేయాలని CSను ఆదేశించింది. దీని విలువ రూ.వేల కోట్లు ఉంటుందని తెలుస్తోంది.