News July 17, 2024

జరగబోయేదాన్ని ఎవరు ఆపగలరు: భోలే బాబా

image

UPలోని హాథ్రస్‌లో సత్సంగ్ నిర్వహించిన భోలే బాబా కాస్‌గంజ్‌లోని తన ఆశ్రమానికి తిరిగొచ్చారు. జులై 2న తన సత్సంగ్‌లో <<13577290>>తొక్కిసలాట <<>>జరిగి 121 మంది చనిపోయిన ఘటనలో కుట్ర కోణం ఉందని ఆరోపించారు. ‘ఆ దుర్ఘటన ఎంతో బాధించింది. కానీ జరగబోయేదాన్ని ఎవరు ఆపగలరు? వచ్చిన వారు ఏదో ఒక రోజు పోవాల్సిందే. అక్కడ విషపూరిత స్ప్రే గురించి ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దీని వెనుక కుట్ర ఉంది. పోలీసుల విచారణలో నిజాలు బయటకొస్తాయి’ అని తెలిపారు.

Similar News

News November 17, 2025

పెళ్లిపై రూమర్స్.. అసహ్యమేస్తోందన్న త్రిష

image

తనకు పెళ్లంటూ వస్తున్న రూమర్స్ అసహ్యం కలిగిస్తున్నాయని హీరోయిన్ త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మ్యారేజ్, పొలిటికల్ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ‘నేనెవరితో ఫొటో దిగితే వారితో పెళ్లి అయినట్లేనా? నాకు ఎంత మందితో వివాహం చేస్తారు? ఇలాంటి ప్రచారం ఆపండి’ అని పేర్కొన్నారు. త్రిష ఓ హీరోతో డేట్‌లో ఉందని, చండీగఢ్ బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లి చేసుకోబోతున్నారని తరచుగా రూమర్లు పుట్టుకొస్తున్నాయి.

News November 17, 2025

కిచెన్ టిప్స్

image

* కొత్తిమీర వాడిపోతే వేర్లు కట్ చేసి ఉప్పు కలిపిన నీటిలో కాడలు మునిగేలా ఉంచాలి. అరగంట తర్వాత కొత్తిమీర తాజాగా మారుతుంది.
* ఎంత నీరు తాగినా దాహం తీరకపోతే ఒక యాలక్కాయ నోట్లో వేసుకొని నమలి నీళ్లు తాగాలి. * గసగసాలు రుబ్బేముందు 10 నిమిషాలు వేడినీటిలో నానబెట్టి మిక్సీ పడితే మెత్తగా అవుతాయి. * ఉప్పు చెమ్మ చేరి నీరు కారిపోకుండా ఉండాలంటే.. ఉప్పు ఉన్న జాడీలో రెండు పచ్చిమిరపకాయలు వేయాలి.

News November 17, 2025

వారానికి 72 గంటల పనితోనే దేశాభివృద్ధి: మూర్తి

image

వారానికి 72గంటలు పనిచేయాలన్న గత వ్యాఖ్యలను ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి మరోసారి సమర్థించుకున్నారు. రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘చైనా ఆర్థిక వ్యవస్థను భారత్ అందుకోగలదు. కానీ దీనికోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలి. చైనాలో వారానికి 72 గంటల (9AM-9PM-6 రోజులు) రూల్ ఉంది. దేశ పని సంస్కృతిలో మార్పు అవసరమని చెప్పడానికి చైనా పని నియమమే ఉదాహరణ’ అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.