News January 13, 2025

బీసీసీఐ కొత్త సెక్రటరీ, ట్రెజరర్ ఎవరంటే?

image

బీసీసీఐ సెక్రటరీగా దేవజిత్ సైకియా, ట్రెజరర్‌గా ప్రభ్‌తేజ్ సింగ్ భాటియాను ఎన్నుకున్నట్లు బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. తక్షణమే వీరు తమ బాధ్యతలను చేపడతారని పేర్కొంది. నిన్న జరిగిన స్పెషల్ జనరల్ మీటింగ్‌లో నిర్వహించిన ఓటింగ్‌లో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపింది. జైషా, ఆశిష్ షెలార్ స్థానాలను భర్తీ చేస్తున్న వీరు సమర్థవంతంగా పనిచేస్తారని ఆశిస్తున్నట్లు ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ పేర్కొన్నారు.

Similar News

News February 14, 2026

కన్నడ దర్శకుడు, నటుడు జో సైమన్ కన్నుమూత

image

కన్నడ దర్శకుడు, నటుడు జో సైమన్(80) కన్నుమూశారు. నిన్న ఫిల్మ్ ఛాంబర్ సమావేశానికి వెళ్లిన ఆయన గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా కాపాడలేకపోయామని సన్నిహిత వర్గాలు తెలిపాయి. సాహస సింహా, సింహా జోడి వంటి పాపులర్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. రవివర్మ, మణి, టైమ్ బాంబ్ తదితర సినిమాల్లో నటించారు. ఆయన మరణంపై కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ విచారం వ్యక్తం చేశారు.

News February 14, 2026

మచిలీపట్నంలోని BELలో పోస్టులు

image

మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్<>(BEL<<>>) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ అర్హత గలవారు ముందుగా apprenticeshipindia.gov.in/లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫిబ్రవరి 22న రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. నెలకు స్టైపెండ్ రూ.9,600 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in

News February 14, 2026

నామినేషన్ కోసమే రూ.8కోట్లు.. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఓటమి

image

TG: నామినేషన్ సమయంలో రూ.8కోట్ల పన్ను కట్టిన నిజామాబాద్ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కాటిపల్లి శమంతకు ఓటర్లు షాకిచ్చారు. 19వ డివిజన్ నుంచి బరిలోకి దిగిన ఆమె BJP అభ్యర్థి చేతిలో ఓడారు. పార్టీ ముందుగానే మేయర్ అభ్యర్థిగా ప్రకటించడంతో గెలుపు కోసం ఖర్చుకు వెనుకాడలేదని తెలుస్తోంది. తన డివిజన్‌లో ఒక్కో ఓటుకు ₹5వేల వరకు పంచినట్లు సమాచారం. మిగతా డివిజన్లకూ డబ్బు సర్దడంతో ₹20కోట్ల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది.