News April 5, 2024
‘పెనమలూరు’లో పవర్ ఎవరిదో?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_42024/1712278354056-normal-WIFI.webp)
AP: కృష్ణా(D) పెనమలూరు రాజకీయాలు ఎప్పుడూ హాట్హాట్గా ఉంటాయి. 2008లో ఈ సెగ్మెంట్ ఏర్పడింది. 2009లో కాంగ్రెస్, 14లో TDP, 19లో YCP గెలుపొందాయి. మంత్రి, పెడన MLA జోగి రమేశ్ను YCP ఇక్కడి నుంచి పోటీ చేయిస్తోంది. పథకాల లబ్ధిదారుల ఓట్లు కలిసొస్తాయని అంచనా వేస్తోంది. నిత్యం ప్రజల్లో ఉండటం, గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి, క్యాడర్ సపోర్ట్తో గెలుస్తానని TDP అభ్యర్థి బోడె ప్రసాద్ ధీమాగా ఉన్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News January 18, 2025
GOOD NEWS: ఉచితంగా ప్లాట్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737174592838_367-normal-WIFI.webp)
AP: ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి <<15179066>>ఇళ్ల స్థలాలు<<>> ఇస్తామని నిన్న ప్రకటించింది. ఇవి ఉచితమా? డబ్బు చెల్లించాలా? అనే సందేహాలు ఉన్నాయి. అయితే ఈ ప్లాట్లు పూర్తి ఉచితంగా ఇస్తారు. గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున కేటాయిస్తారు. కేంద్ర పథకాలతో ఈ కాలనీల్లో మౌలిక వసతులు మెరుగుపరచనున్నారు. గతంలో ప్లాట్లు పొంది ఇళ్లు నిర్మించుకోని వారికి వాటిని రద్దు చేసి కొత్త ప్లాట్లు ఇస్తారు.
News January 18, 2025
తిరుమలలో భక్తుల రద్దీ.. అలిపిరి వద్ద ట్రాఫిక్ జామ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737175267354_367-normal-WIFI.webp)
AP: తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. రేపటితో వైకుంఠ ద్వార దర్శనం ముగియనుంది. అటు సంక్రాంతి సెలవులు కూడా రేపటితో ముగియనుండటంతో భక్తులు శ్రీనివాసుడి దర్శనం కోసం వస్తున్నట్లు తెలుస్తోంది.
News January 18, 2025
అమిత్ షా దేశ ద్రోహి, ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదు: షర్మిల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737172311119_367-normal-WIFI.webp)
AP: అమిత్ షా రాష్ట్ర పర్యటనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని షర్మిల అన్నారు. ‘అంబేడ్కర్ను అవమానించిన షాకు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసనలు వ్యక్తం చేయాలని పార్టీ నాయకత్వానికి పిలుపునిస్తున్నాం. దేశ ప్రజలకు వెంటనే షా క్షమాపణలు చెప్పి, తక్షణమే రాజీనామా చేయాలి. ఆ దేశ ద్రోహితో వేదికలు పంచుకునే పార్టీలూ దేశద్రోహం చేసినట్లే’ అని ట్వీట్ చేశారు.