News June 22, 2024

బీజేపీ స్టేట్ చీఫ్ ఎవరు? నేతల వ్యాఖ్యలకు అర్థమేంటి?

image

TG: రాష్ట్రంలో కాషాయ దళపతి ఎవరనే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ బీజేపీలోని నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొత్త నీరు, కొత్త నాయకత్వం అవసరమంటూ ఈటల కామెంట్ చేయగా.. దేశం, ధర్మం, పార్టీపై భక్తి ఉన్నవారికే పగ్గాలు ఇవ్వాలని రాజాసింగ్ అన్నారు. దీంతో వీరిద్దరూ చీఫ్ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రఘునందన్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్ కూడా పోటీ పడుతున్నట్లు సమాచారం.

Similar News

News January 6, 2026

ఎక్కడ మేసినా పేడ మన పెరట్లోనే వెయ్యాలి

image

పశువులు పగలంతా బయట ఎక్కడ మేత మేసినా, సాయంత్రానికి తిరిగి తమ యజమాని ఇంటికే చేరుకుంటాయి. అవి వేసే పేడ యజమాని పెరట్లోనే పడుతుంది. అది ఎరువుగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ తిరిగినా, ఎంత పేరు ప్రఖ్యాతలు, డబ్బు సంపాదించినా ఆ లాభం చివరికి తన సొంత ఇంటికి, తన కుటుంబానికి లేదా తన ఊరికే ఉపయోగపడాలని ఈ సామెత చెబుతుంది.

News January 6, 2026

సంక్రాంతికి 5 వేలకు పైగా ప్రత్యేక బస్సులు!

image

TG: సంక్రాంతి పండుగ సందర్భంగా 5 వేలకు పైగా బస్సులు నడపాలని ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని జిల్లాలకు 2,500.. ఏపీకి 3 వేల వరకు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 9వ తేదీ నుంచి రద్దీకి అనుగుణంగా ఈ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఒకట్రెండు రోజుల్లో స్పెషల్ బస్సుల వివరాలు ప్రకటిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మరి మీరు పండుగకు ఊరెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారా?

News January 6, 2026

వాట్సాప్‌లో తిరుమల సమాచారం!

image

AP: తిరుమల వెళ్లే భక్తులు వాట్సాప్ ద్వారా పలు సేవలు పొందొచ్చు. 9552300009 నంబరుకు వాట్సాప్‌లో Hi అని మెసేజ్ పంపితే పలు రకాల సమాచారాన్ని టీటీడీ అందిస్తోంది. సర్వ దర్శన స్లాట్ల స్టేటస్, ఎన్ని కంపార్టుమెంట్లు నిండాయి?, అందుబాటులో ఉన్న శ్రీవాణి టికెట్లు, కాషన్ డిపాజిట్ రిఫండ్ ట్రాకింగ్ స్టేటస్ తదితర సేవలు అందుతాయని టీటీడీ పేర్కొంది.