News June 22, 2024
బీజేపీ స్టేట్ చీఫ్ ఎవరు? నేతల వ్యాఖ్యలకు అర్థమేంటి?

TG: రాష్ట్రంలో కాషాయ దళపతి ఎవరనే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ బీజేపీలోని నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొత్త నీరు, కొత్త నాయకత్వం అవసరమంటూ ఈటల కామెంట్ చేయగా.. దేశం, ధర్మం, పార్టీపై భక్తి ఉన్నవారికే పగ్గాలు ఇవ్వాలని రాజాసింగ్ అన్నారు. దీంతో వీరిద్దరూ చీఫ్ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రఘునందన్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్ కూడా పోటీ పడుతున్నట్లు సమాచారం.
Similar News
News January 31, 2026
జంతు కొవ్వు కలిసిందని కేంద్ర సంస్థే చెప్పింది: లోకేశ్

AP: దేవుడి లడ్డూపై వైసీపీ డ్రామా మొదలుపెట్టిందని, అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేశ్ టీడీపీ శ్రేణులకు సూచించారు. ‘2024లో చంద్రబాబు సీఎం కాగానే నెయ్యి శాంపిల్స్ తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర ఆధ్వర్యంలోని సంస్థ ద్వారా టెస్ట్ చేయగా జంతు కొవ్వు కలిసిందని, వెజిటబుల్ ఆయిల్ ఉందని తేలింది. మొన్నటి ఛార్జ్షీట్ పేజీ నెం.35లో సీబీఐ చాలా స్పష్టంగా చెప్పింది’ అని కాకినాడలో కార్యకర్తల సమావేశంలో తెలిపారు.
News January 31, 2026
WPL: ముంబైపై గుజరాత్ విజయం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్తో మ్యాచులో గుజరాత్ జెయింట్స్ 11 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత గుజరాత్ 20 ఓవర్లలో 167/4 స్కోర్ చేయగా, అనంతరం ముంబై 20 ఓవర్లలో 156/7కి పరిమితమైంది. MI కెప్టెన్ హర్మన్ ప్రీత్ (48 బంతుల్లో 82*) చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ టోర్నీ చరిత్రలో ముంబైపై గుజరాత్కి ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఈ విజయంతో ఆ జట్టు ప్లేఆఫ్స్కి అర్హత సాధించింది.
News January 31, 2026
మేడారంలో మొబైల్ ఛార్జింగ్కు రూ.50!

మేడారం జాతర ‘కాదేదీ వ్యాపారానికి అనర్హం’ అన్నట్లుగా మారింది. మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన భక్తుల అవసరమే కొందరికి ఉపాధినిస్తోంది. అక్కడ ఏర్పాటు చేసిన ఛార్జింగ్ పాయింట్లలో ఒక్క మొబైల్ ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు రూ.50 వసూలు చేస్తున్నారు. అలాగే వేడి నీళ్లంటూ కొందరు, స్నానాలు చేసే సమయంలో బ్యాగులకు కాపలా ఉంటూ మరికొందరు కూడా జాతరలో ఉపాధి పొందుతున్నారు.


