News August 20, 2025
తుది జట్టులో గిల్.. ఎవరిని పక్కన పెట్టాలి?

ఆసియా కప్కు భారత జట్టును BCCI ప్రకటించిన విషయం తెలిసిందే. వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడంతో గిల్కు తుది జట్టులో ప్లేస్ ఖాయమైనట్లే. దీంతో టాపార్డర్ బ్యాటర్స్ అభిషేక్, శాంసన్, తిలక్లలో ఒకర్ని పక్కన పెట్టాల్సి రావొచ్చు. అభిషేక్ ICC No.1 ర్యాంకర్గా ఉన్నారు. మరోవైపు శాంసన్ గత 10 T20Isలో 3 సెంచరీలు, తిలక్ లాస్ట్ 7 T20Isలో 2 సెంచరీలు చేసి ఫామ్లో ఉన్నారు. మరి వీరిలో ఎవరిని పక్కన పెట్టాలి? COMMENT
Similar News
News August 20, 2025
AI సాయంతో 2-3గంటల్లో శ్రీవారి దర్శనం: BR నాయుడు

AP: TTDలో పని చేసే అన్యమత సిబ్బందిని మరో విభాగానికి మార్చడం, వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వడంపై చర్యలు తీసుకుంటున్నట్లు TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. ‘AI సాయంతో 2-3గంటల్లో శ్రీవారి దర్శనం చేయిస్తాం. ఉదయం టికెట్లు తీసుకుంటే సాయంత్రానికి దర్శనమయ్యేలా చూస్తాం. గతంలో VIP దర్శనాలు ఉ.10గంటలకు ఉండటంతో భక్తులు ఇబ్బంది పడేవారు. వాటిని ఉ.8-8.30గంటలకు ముగించేలా చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు.
News August 20, 2025
ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు లోక్సభ ఆమోదం

ఆన్లైన్ బెట్టింగ్ మోసాలకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో కేంద్రం లోక్సభలో ప్రవేశ పెట్టిన ‘ఆన్లైన్ గేమింగ్ బిల్లు’కు ఆమోదం లభించింది. ప్రతిపక్షాల నిరసన మధ్యే బిల్లు పాస్ అయ్యింది. ఈ-స్పోర్ట్స్, ఆన్లైన్ గేమ్స్ మధ్య విభజన చూపించేలా బిల్లును రూపొందించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ గేమింగ్ యాప్స్ నిర్వహించే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష/రూ.కోటి వరకు జరిమానా లేదా రెండూ విధించే ఆస్కారం ఉంటుంది.
News August 20, 2025
వన్డే ర్యాంకింగ్స్లో రోహిత్, కోహ్లీ పేర్లు మిస్సింగ్!

ICC వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో రోహిత్, కోహ్లీ పేర్లు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వారం క్రితం రోహిత్ 2, కోహ్లీ 4వ స్థానాల్లో ఉన్నారు. తాజా ర్యాంకింగ్స్లో TOP-100లో కూడా లేరు. దీనికి టెక్నికల్ గ్లిచ్ కారణమా లేదా వారి రిటైర్మెంట్కు సంకేతమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూల్ ప్రకారం 9-12 నెలలు ODIs ఆడకపోతే ర్యాంకింగ్స్ నుంచి తొలగిస్తారు. చివరిగా వీరిద్దరూ 2025 మార్చిలో (CT) ODIs ఆడారు.