News May 3, 2024
అరకులో గెలుపు వరకు వెళ్లేదెవరు?

AP: అరకు పార్లమెంట్ నియోజకవర్గం(ST) 2008లో ఏర్పడింది. 2009లో కిశోర్ చంద్రదేవ్(INC), 2014లో కొత్తపల్లి గీత, 2019లో గొడ్డేటి మాధవి వైసీపీ తరఫున గెలిచారు. ఈ ఎన్నికల్లో గీత బీజేపీ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతుండగా, వైసీపీ నుంచి డాక్టర్ చెట్టి తనూజా రాణి పోటీ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్లో గెలుపు బోణీ కొట్టాలని బీజేపీ, హ్యాట్రిక్ కోసం వైసీపీ ఆరాటపడుతున్నాయి.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


