News May 3, 2024

అరకులో గెలుపు వరకు వెళ్లేదెవరు?

image

AP: అరకు పార్లమెంట్ నియోజకవర్గం(ST) 2008లో ఏర్పడింది. 2009లో కిశోర్ చంద్రదేవ్(INC), 2014లో కొత్తపల్లి గీత, 2019లో గొడ్డేటి మాధవి వైసీపీ తరఫున గెలిచారు. ఈ ఎన్నికల్లో గీత బీజేపీ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతుండగా, వైసీపీ నుంచి డాక్టర్ చెట్టి తనూజా రాణి పోటీ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్‌లో గెలుపు బోణీ కొట్టాలని బీజేపీ, హ్యాట్రిక్ కోసం వైసీపీ ఆరాటపడుతున్నాయి.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News March 19, 2026

దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

image

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.

News March 19, 2026

ఒక్క రోజే రూ.10వేలు తగ్గిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర భారీగా తగ్గింది. ఇవాళ ఒక్కరోజే రూ.10 వేలు తగ్గి కిలో రూ.2,65,000 పలుకుతోంది. గత వారంతో పోల్చితే మొత్తంగా రూ.25,000 తగ్గుదల నమోదైంది. అటు <<19423062>>బంగారం<<>> ధరలు కూడా ఇవాళ తగ్గిన విషయం తెలిసిందే.

News March 19, 2026

‘డోరేమాన్’ డైరెక్టర్ కన్నుమూత

image

‘డోరేమాన్’ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారులను అలరించిన ప్రముఖ డైరెక్టర్ సుటోము షిబాయామా(84) కన్నుమూశారు. కొంతకాలంగా లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన మార్చి 6న మరణించినట్లు జపనీస్ యానిమేషన్ స్టూడియో ఆసియా-డో ప్రకటించింది. కుటుంబసభ్యుల కోరిక మేరకు ప్రైవేటుగా అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపింది. 1980 నుంచి 2004 వరకు డోరేమాన్ టీవీ యానిమేషన్ సిరీస్‌లకు ఆయన దర్శకత్వం వహించారు.