News March 29, 2024

NZBలో 72మందిపై వేటు ఎందుకు?

image

MP, MLA అభ్యర్థులు ఎన్నికల్లో తాము చేసిన ఖర్చును ECకి సమర్పించాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో వారిపై అనర్హత వేటు పడుతుంది. ఈ కారణంతో ఒక్క నిజామాబాద్‌లో ఏకంగా 72మందిపై వేటు పడింది. పసుపు బోర్డు విషయంలో నిరసనగా 2019లో నామినేషన్ వేసిన రైతులు ఖర్చుల వివరాలు ఇవ్వలేదు. ఈసారి అనర్హతకు గురైన 1,069మంది గత ఎన్నికల్లో ఖర్చు వివరాలు చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్‌లో 51 మంది, తెలంగాణలో 107 మంది అనర్హతకు గురయ్యారు.

Similar News

News January 15, 2025

మీరు గేమ్ నుంచి తీసేయొచ్చు.. కానీ నా వర్క్‌ను ఆపలేరు: పృథ్వీ షా

image

జాతీయ జట్టుతోపాటు దేశవాళీ టీమ్‌లో తనకు చోటు దక్కకపోవడంపై పృథ్వీ షా పరోక్షంగా స్పందించారు. ‘మీరు నన్ను గేమ్ నుంచి తీసేయొచ్చు. కానీ నా వర్క్‌ను మాత్రం ఆపలేరు’ అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకునేందుకు అతను కొన్ని వారాలుగా మైదానం, జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ఐపీఎల్‌లో కూడా పృథ్వీని ఏ జట్టూ కొనుగోలు చేయని విషయం తెలిసిందే.

News January 15, 2025

నన్ను దేవుడే రక్షిస్తాడు: కేజ్రీవాల్

image

ఖ‌లిస్థానీ వేర్పాటువాదుల నుంచి ప్రాణ‌హాని ఉంద‌న్న వార్త‌ల‌పై కేజ్రీవాల్ స్పందించారు. దేవుడే త‌న‌ను ర‌క్షిస్తాడ‌ని, దేవుడు అనుమ‌తించినంత కాలం జీవిస్తాన‌ని పేర్కొన్నారు. దేవుడే ర‌క్షించే వారిని ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ ల‌క్ష్యంగా ఖ‌లిస్థానీ మ‌ద్ద‌తుదారుల హిట్ స్క్వాడ్ ఏర్పడింద‌ని, ఢిల్లీ ఎన్నిక‌ల్లో వారు కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసుకున్న‌ట్టు నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రించాయి.

News January 15, 2025

ఇంటి వద్దకే టెక్నీషియన్లు.. తక్కువ ధరకే సర్వీస్: టీడీపీ

image

AP: వృత్తిదారులను ఆదుకునేందుకు CM CBN ఆదేశాలతో ‘హోమ్ ట్రయాంగిల్ యాప్’తో మెప్మా ఒప్పందం చేసుకుందని TDP వెల్లడించింది. ‘20వేల మంది టెక్నీషియన్లకు మెప్మా శిక్షణ ఇస్తోంది. TV, AC, ఫ్రిజ్, కంప్యూటర్ తదితర 30 రకాల డివైజ్‌లు పాడైతే టెక్నీషియన్లు ఇంటి వద్దకే వచ్చి తక్కువ ధరకే బాగుచేస్తారు. MAR నుంచి 123 పట్టణాల్లో సేవలు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో టెక్నీషియన్‌కు ₹20-25వేల ఆదాయం వస్తుంది’ అని పేర్కొంది.