News November 11, 2024
మ్యాన్హోల్స్ మూతలు రౌండ్గానే ఎందుకు?

దీనికి పలు కారణాలున్నాయి. వేరే ఆకారంలో ఉంటే మూత తీసేటప్పుడు పొరపాటున లోపలికి పడవచ్చు. రౌండ్గా ఉంటేనే ఎటువైపు నుంచీ లోపల పడిపోదు, పైకి సైతం సులువుగా ఎత్తవచ్చు. వృత్తాకారంలో ఉంటేనే ఈజీగా పక్కకు తరలించవచ్చు. అంతే సులువుగా మూత బిగించవచ్చు. ఒక సైజులోని చతురస్రం సహా ఏ ఇతర ఆకారాల్లోని మూత ఎంత స్థలాన్ని మూయగలదో అదే స్పేస్ను రౌండ్ షేప్ తక్కువ సైజులో మూస్తుంది. దీంతో నిర్మాణ ఖర్చు కూడా తక్కువ అవుతుంది.
Similar News
News March 9, 2026
ఏలూరు జిల్లాకు 86.7 కి.మీల కొత్తదారి

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి నుంచి కొవ్వూరు వరకు రెండు వరుసల హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ₹.368 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీని వల్ల పోలవరం ప్రాజెక్ట్కు కనెక్టివిటీ పెరుగుతుంది. అలాగే హైదరాబాద్ – రాజమండ్రి ప్రయాణ దూరం తగ్గుతుంది. సుమారు 86.7 కి.మీ పొడవైన ఈ రహదారి నిర్మాణంతో 100 ఏజెన్సీ గ్రామాలు, 30 మైదాన ప్రాంత గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం లభించనుంది.
News March 9, 2026
‘జీ రామ్ జీ’కి లోగో డిజైన్ చేస్తే ₹50వేలు!

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ స్కీమ్ లోగో డిజైన్పై కేంద్రం పోటీని నిర్వహిస్తోంది. లోగో డిజైనింగ్లో విజేతగా నిలిచిన వారికి ₹50వేలు బహుమతిగా ఇవ్వనుంది. ఈ కంటెస్ట్లో పాల్గొనాలని అనుకునేవారు <
News March 9, 2026
ఆస్తుల్లో ప్రశాంతిరెడ్డి టాప్

దేశవ్యాప్తంగా ఉన్న <<19333433>>మహిళా ప్రజాప్రతినిధుల్లో<<>> 14 మంది బిలియనీర్లు ఉన్నట్లు ADR వెల్లడించింది. వీరి మొత్తం ఆస్తి విలువ రూ.8,234 కోట్లని తెలిపింది. ఏపీకి చెందిన కోవూరు TDP MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రూ.716 కోట్లతో టాప్లో ఉన్నారు. APలోని 24 మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి రూ.74 కోట్లు, TGలోని 11 మంది నాయకురాళ్ల సగటు ఆస్తి రూ.14 కోట్లుగా పేర్కొంది.


