News November 4, 2024
కుల గణన ఎందుకు? సమగ్ర కుటుంబ సర్వే ఏమైంది?: బండి

TG: కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన ఎందుకు చేస్తోందని బండి సంజయ్ ప్రశ్నించారు. గత BRS ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ ఆ రిపోర్ట్ ఇవ్వకపోతే ఆ సర్వేకు చేసిన ఖర్చంతా ఆయన నుంచే రికవరీ చేయాలన్నారు. KCR, KTRలను చూస్తుంటే రాజకీయాలపై అసహ్యం కలుగుతోందని మండిపడ్డారు. రుణమాఫీ చేయలేదని, ఉద్యోగాలు, ఇతర హామీలపై సమాధానం చెప్తూ కేటీఆర్ పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 26, 2025
దశాబ్దాల డ్రీమ్.. ఫైనల్గా మార్కాపురం డిస్ట్రిక్ట్!

మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామన్న హామీని CM చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. 1970లో ఒంగోలు జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. సీఎం నిర్ణయంతో దశాబ్దాల కల తీరడంతో పశ్చిమ ప్రకాశం ప్రాంత వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 21 మండలాలతో రాష్ట్రంలో 28వ జిల్లాగా మార్కాపురాన్ని ఏర్పాట్లు చేస్తూ త్వరలో గెజిట్ విడుదలకానుంది.
News November 26, 2025
టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం

AP: ఇటీవల ఉదయ్పూర్లో అట్టహాసంగా కూతురి పెళ్లి చేసిన బిలియనీర్ మంతెన రామలింగరాజు తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించారు. PAC 1,2,3 భవనాల ఆధునికీకరణ కోసం కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేరిట రూ.9కోట్లు ఇచ్చినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. రామలింగరాజు 2012లోనూ శ్రీవారికి రూ.16 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇటీవల ఆయన కూతురి వివాహానికి ట్రంప్ కుమారుడు సహా హాలీవుడ్ దిగ్గజాలు తరలివచ్చారు.
News November 26, 2025
పలాశ్ను అన్ఫాలో చేసిన స్మృతి.. నిజమిదే!

కాబోయే భర్త పలాశ్ ముచ్చల్తో పెళ్లికి ముందు వేడుకల ఫొటోలను స్మృతి మంధాన డిలీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇన్స్టాలో అతడిని ఆమె అన్ఫాలో చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అది అవాస్తవమని తేలింది. పలాశ్ను ఆమె ఫాలో అవుతున్నారు. స్మృతి తండ్రికి గుండెపోటు రావడంతో ఈ నెల 23న జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. పలాశ్ చాటింగ్ బయటపడటంతో పెళ్లి మొత్తానికే రద్దయిందంటూ SMలో ప్రచారం జరుగుతోంది.


