News August 19, 2024
త్వరగా దహనమెందుకు చేశారు?: బాధితురాలి తండ్రి

<<13891437>>కోల్కతాలో<<>> హత్యాచారానికి గురైన తన కుమార్తె మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వెంటనే దహనం చేయడాన్ని బాధితురాలి తండ్రి ప్రశ్నించారు. సాక్ష్యాలను నాశనం చేసే అవకాశంపై సందేహాలను లేవనెత్తారు. శ్మశానవాటికలో దహనానికి మూడు మృతదేహాలు ఉన్నా తమ కుమార్తె మృతదేహాన్ని ముందుగా దహనం చేశారన్నారు.
Similar News
News July 8, 2025
తోడు కోసం పెళ్లి చేసుకుంటే రూ.28 కోట్లతో జంప్!

AP: చిత్తూరు(D) రాజుపేటకు చెందిన నాగమణి (50) గతంలో భర్త, కుమారుడిని కోల్పోయారు. శేష జీవితంలో తోడు కోసం పెళ్లి బ్రోకర్ ద్వారా ప్రకటన ఇచ్చారు. శేషాపురానికి చెందిన శివప్రసాద్(40) కరోనాతో తన భార్య చనిపోయిందని నమ్మించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరులో నాగమణికి చెందిన రూ.10 కోట్ల విలువైన భూమి, రూ.15 కోట్ల అపార్ట్మెంట్ విక్రయించడంతో పాటు రూ.3 కోట్లు తీసుకుని పారిపోయాడు. ఆమె పోలీసులను ఆశ్రయించారు.
News July 8, 2025
కొత్త పంచాయతీ భవన నిర్మాణాలకు ఆమోదం

AP: సొంత భవనాలు లేని 417 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో భవనాన్ని రూ.32 లక్షలతో నిర్మించేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ఇందులో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ నుంచి రూ.25 లక్షలు, ఉపాధి హామీ పథకం కింద రూ.7లక్షల నిధులను ఉపయోగించుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
News July 8, 2025
9,718 ఎకరాల్లో ఓర్వకల్లు నోడ్

AP: హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ నోడ్ మాస్టర్ ప్లాన్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 9,718.84 ఎకరాల్లో ఈ కారిడార్ ఉండనుండగా, 5,107 ఎకరాలను పారిశ్రామిక అవసరాల కోసం వాడుతారు. 1,212 ఎకరాలు వినోద సేవలు, 898 ఎకరాలు రోడ్ల కోసం, 510 ఎకరాలు గ్రీన్ జోన్, 474 రవాణా కోసం, 456 ఎకరాలు ప్రజా వినియోగాల కోసం, 336 ఎకరాలు నివాస ప్రాంతాల కోసం ఉపయోగిస్తారు.