News February 18, 2025
వంశీతో ఎందుకు ములాఖత్ అయ్యారు జగన్?: పల్లా

AP: దళిత వ్యతిరేకి, మహిళా ద్రోహి, దోపిడీదారుడైన YCP నేత వల్లభనేని వంశీతో ఎందుకు ములాఖత్ అయ్యారు? అని జగన్ను ప్రశ్నిస్తూ TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. దళిత ఉద్యోగి సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి వేధిస్తే.. అతని కంటే మీకు నేరస్థుడు ఎక్కువైపోయాడా?, అసెంబ్లీలో మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచిన నేరస్థుడిని ఏ రకంగా పరామర్శిస్తావు జగన్? అంటూ పలు ప్రశ్నలను సంధించారు.
Similar News
News March 16, 2025
టెస్లా కోసం ప్రభుత్వం ప్రయత్నాలు.. భూముల పరిశీలన

AP: అమెరికాకు చెందిన ఆటోమోటివ్ కంపెనీ టెస్లాను రాష్ట్రానికి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తిరుపతి జిల్లా మేనకూరు, సత్యవేడులోని శ్రీసిటీతో పాటు కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీలో భూములను పరిశీలిస్తున్నారు. ఈ మూడు ప్రాంతాలు చెన్నైకి 120 కి.మీ దూరంలో ఉండటం, విమానాశ్రయాలు, పోర్టులు, నేషనల్ హైవేలు దగ్గరగా ఉండటం కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
News March 16, 2025
పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య.. కొత్త విషయాలు

కాకినాడలో చంద్రశేఖర్ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో పెద్ద కొడుకు జోషిల్ (6)ను రూ.లక్షల్లో ఫీజులు ఉన్న ఓ స్కూల్లో చేర్పించాడు. ఆర్థిక ఇబ్బందులతో చిన్న స్కూలుకు మార్చాడు. లక్షలు కట్టి చదివించగలనా? ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడగలరా? అనే ఆత్మన్యూనతతో ఇలా చేసినట్లు భావిస్తున్నారు. చంద్రశేఖర్ అంత కర్కశుడు కాదని బంధువులు చెబుతున్నారు.
News March 16, 2025
అమరావతి కోసం రూ.11వేల కోట్లు.. నేడు ఒప్పందం

AP: నేడు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో), సీఆర్డీఏ మధ్య ఒప్పందం కుదరనుంది. రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ ఏడాది జనవరి 22న హడ్కో రూ.11వేల కోట్ల రుణం మంజూరు చేసింది. నేడు సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదరనుంది. అగ్రిమెంట్ అయ్యాక హడ్కో నిధులను విడుదల చేయనుంది.