News June 29, 2024

రీఛార్జ్ ధరలు ఎందుకు పెరిగాయంటే?

image

జియోతో మొదలై ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు టారిఫ్‌లు పెంచడంతో యూజర్లకు రీఛార్జ్ భారంగా మారింది. యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకునేందుకే సంస్థలు టారిఫ్‌ను పెంచాయి. FY24 క్యూ4లో ఎయిర్‌టెల్ ARPU ₹209, జియో ₹181.7, Vi ₹146గా ఉంది. ఈ సగటు FY27కి ₹300కు పెంచుకోవాలని ఎయిర్‌టెల్ ఆశిస్తోంది. 5జీ సేవలను మానిటైజ్ చేసుకునేందుకు కూడా టారిఫ్‌లు పెంచుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Similar News

News September 21, 2024

రాజకీయాలొద్దు.. చేతనైతే విచారణ చేయించండి: బొత్స

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో వేగంగా విచారణ జరిపి నిజాలు తేల్చాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ‘రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవద్దు. చేతనైతే విచారణ జరిపించాలి, అంతేగాని రాజకీయం చేయవద్దు. దేవుడికి అపచారం చేస్తే ఎప్పటికైనా శిక్ష పడుతుంది. ప్రజల మనోభావాలతో రాజకీయాలు సమంజసం కాదు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం’ అన్నారు.

News September 21, 2024

లంచ్: భారత్ ఆధిక్యం 432 రన్స్

image

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో భారత్ 432 రన్స్ ఆధిక్యం సాధించింది. మూడో రోజు లంచ్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 205 రన్స్ చేసింది. క్రీజులో గిల్(86), పంత్(82) ఉన్నారు. వీరిద్దరూ 138 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. బంగ్లా బౌలర్లు లంచ్ వరకు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 376, బంగ్లా 149 రన్స్ చేసిన విషయం తెలిసిందే.

News September 21, 2024

ఎల్లుండి అల్పపీడనం.. విస్తారంగా వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించిందని, ఇవాళ మరో ఆవర్తనం ఏర్పడనుందని IMD వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా కదలి ఎల్లుండి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు విస్తారంగా వానలు కురుస్తాయంది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. మరోవైపు ఈవారంలోనే దేశంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు.