News September 15, 2024
వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు?

ఇప్పుడైతే వినాయకులను POPతో చేస్తున్నారుగానీ ఒకప్పుడు చెరువులోని స్వచ్ఛమైన ఒండ్రుమట్టితోనే తయారుచేసేవారు. లంబోదరుడిని పూజించే 21రకాల పత్రిల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ప్రవహించే నదులు, వాగులతో పాటు చెరువుల్లోని నీరు సర్పాలు ఇతర కీటకాలతో విషపూరితమవుతాయి. ఒండ్రుమట్టి వినాయకులను నిమజ్జనం చేసి, పత్రిలను వాటిలో వదిలితే నీరు శుద్ధి అవడంతో పాటు ఔషధగుణాలు కలగలుస్తాయని పండితులు చెబుతున్నారు.
Similar News
News January 8, 2026
సంక్రాంతి బరి నుంచి మరో సినిమా ఔట్?

శివకార్తికేయన్, శ్రీలీల జంటగా నటించిన ‘పరాశక్తి’ తెలుగు వెర్షన్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. జనవరి 10న తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కావాల్సిన ఈ చిత్రానికి థియేటర్లు దొరకడం లేదని సమాచారం. తెలుగులో ‘రాజాసాబ్’, ‘MSVPG’ వంటి పెద్ద సినిమాలు పోటీలో ఉండటం ‘పరాశక్తి’కి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే విజయ్ నటించిన జననాయగన్ సెన్సార్ సమస్యతో సంక్రాంతి బరి నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.
News January 8, 2026
అమరావతికి చట్టబద్ధత.. రూల్స్, ప్రాసెస్ ఇదీ

AP పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పార్ట్-2లో 5(1) ప్రకారం పదేళ్ల వరకు HYD ఉమ్మడి రాజధాని. 5(2) ప్రకారం గడువు ముగిశాక TGకి హైదరాబాద్, APకి కొత్త రాజధాని ఏర్పాటవుతుంది. ఇప్పుడు ఈ సెక్షన్కు సవరణ చేసి ‘అమరావతి కేంద్రంగా APకి రాజధాని ఏర్పాటైంది’ అనేది జత చేస్తారు. దీంతో 2024 జూన్ 2 నుంచి అమరావతికి చట్టబద్ధత వస్తుంది. ఇప్పటికే న్యాయశాఖ ఆమోదించగా క్యాబినెట్ అనుమతితో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతారు.
News January 8, 2026
66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా ఔట్

ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్ నేతృత్వంలోని ‘సోలార్ అలయన్స్’ సహా 66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంస్థలు US జాతీయ ప్రయోజనాలకు, ఆర్థిక వృద్ధికి, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఉన్నాయని వైట్ హౌస్ పేర్కొంది. ముఖ్యంగా ‘గ్లోబలిస్ట్’ అజెండాలు, రాడికల్ క్లైమేట్ పాలసీల పేరుతో US పన్ను చెల్లింపుదారుల సొమ్ము బిలియన్ల కొద్దీ వృథా అవుతోందని చెప్పుకొచ్చింది.


