News September 15, 2024

వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు?

image

ఇప్పుడైతే వినాయకులను POPతో చేస్తున్నారుగానీ ఒకప్పుడు చెరువులోని స్వచ్ఛమైన ఒండ్రుమట్టితోనే తయారుచేసేవారు. లంబోదరుడిని పూజించే 21రకాల పత్రిల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ప్రవహించే నదులు, వాగులతో పాటు చెరువుల్లోని నీరు సర్పాలు ఇతర కీటకాలతో విషపూరితమవుతాయి. ఒండ్రుమట్టి వినాయకులను నిమజ్జనం చేసి, పత్రిలను వాటిలో వదిలితే నీరు శుద్ధి అవడంతో పాటు ఔషధగుణాలు కలగలుస్తాయని పండితులు చెబుతున్నారు.

Similar News

News November 9, 2025

అవనీ లేఖరాకు మరో స్వర్ణం

image

2025 పారా షూటింగ్ ప్రపంచ కప్‌లో షూటింగ్‌లో అవని లేఖరా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1లో స్వర్ణం సాధించారు. 11 ఏళ్ల వయసులో కారు ప్రమాదానికి గురికావడంతో అవని కాళ్లు రెండూ చచ్చుబడిపోయాయి. మొదట ఆర్చరీ నేర్చుకున్న ఆమె తర్వాత షూటింగ్‌కు మళ్లారు. రెండు ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ పారాఅథ్లెట్‌గా కీర్తి గడించింది. వరుస విజయాలు సాధిస్తూ ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు అవని.

News November 9, 2025

ఆడపిల్ల పెళ్లికి రూ.65వేల సాయం: యోగి

image

యూపీలో భవన నిర్మాణ కార్మికులకు యోగి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ‘కన్యా వివాహ్ సహాయతా యోజన’ కింద ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేయనుంది. సాధారణ వివాహానికి రూ.65వేలు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీకి రూ.75వేలు, సామూహిక వివాహాలకు రూ.85వేలు ఇవ్వనుంది. వీటితో పాటు వేడుక ఖర్చులకు రూ.15వేలు అదనంగా అందించనుంది. భవన నిర్మాణ కార్మికులు సమాజానికి వెన్నెముక అని యోగి కొనియాడారు.

News November 9, 2025

ఓటుకు రూ.7వేలు ఇస్తున్నారు: బండి సంజయ్

image

TG: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాలన్నారు. ప్రజలను ప్రలోభ పెట్టేందుకు కాంగ్రెస్ రూ.5వేలు, BRS రూ.7వేలు ఇస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికే KCR మెడలను వంచామని, కాంగ్రెస్ మెడలూ BJP వంచుతుందని వ్యాఖ్యానించారు. హిందువుల దమ్మేంటో జూబ్లీహిల్స్ ప్రజలు చూపించాలన్నారు.