News August 9, 2024

పుట్టలో పాలు ఎందుకు పోస్తారు?

image

పురుగులు, కీటకాల నుంచి పాములు పొలాలకు రక్షణ కల్పిస్తాయి. వాటికి ఏదైనా అపాయం చేస్తామనే భయంతో అవి మనపై, అవి ఎక్కడ కాటేస్తాయనే భయంతో మనం వాటిపై దాడి చేస్తాం. దీంతో మనుషులు, పాముల మధ్య ఉన్న భయాన్ని పోగొట్టేందుకు, రైతులకు సాయపడే సర్పాలు అంతరించిపోకుండా పెద్దలు నాగుల పంచమికి పుట్టలో పాలు పోయాలనే ఆచారాన్ని తీసుకొచ్చారట. ఇలా పాలు పోసి నాగదేవతలను దర్శించుకోవడం వల్ల సర్ప దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.

Similar News

News November 2, 2025

డేవిడ్, స్టాయినిస్ దూకుడు.. ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే?

image

టీమ్ ఇండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా 186/6 రన్స్ చేసింది. టిమ్ డేవిడ్ (38 బంతుల్లో 74), స్టాయినిస్ (39 బంతుల్లో 64) వీరవిహారం చేశారు. వీరిద్దరూ కలిసి 7 సిక్సర్లు, 16 ఫోర్లు బాదారు. చివర్లో షార్ట్ (26*) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, వరుణ్ 2, దూబే 1 వికెట్ తీశారు.

News November 2, 2025

మోదీ యోగా చేస్తే.. అదానీ, అంబానీ డాన్స్ చేస్తారు: రాహుల్

image

ఓట్ల కోసం ప్రధాని మోదీ డ్రామా ఆడుతున్నారని, ఎన్నికల తర్వాత హామీలను నెరవేర్చరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘ఓట్ల కోసం PM యోగా చేయమన్నా చేస్తారు. కొన్ని ఆసనాలు వేస్తారు. కానీ ఎన్నికలయ్యాక సింగింగ్, డాన్సింగ్ అంతా అదానీ, అంబానీ చేస్తారు. ఇదంతా ఓ నాటకం’ అని ఆరోపించారు. ట్రంప్‌కు మోదీ భయపడుతున్నారని, కొందరు పారిశ్రామికవేత్తలు ఆయన్ను నియంత్రిస్తున్నారని బిహార్ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు.

News November 2, 2025

క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి?

image

క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమికి ముందు వస్తుంది. ఈరోజున విష్ణువు బృందావనంలోకి (తులసి కోటలోకి) అడుగుపెడతారు. అందుకే వ్రతం ఆచరించే వారు లక్ష్మీ స్వరూపమైన తులసి కోటలో విష్ణు స్వరూపమైన ఉసిరి కొమ్మను ఉంచి పూజిస్తారు. తులసి కోటకు సమీపంలో విష్ణువు (లేదా) కృష్ణుడి ప్రతిమను ఉంచి పూజించడం శ్రేష్ఠం. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరిస్తే, ఆయురారోగ్యం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని వేదాలు చెబుతున్నాయి.