News December 9, 2024
చెక్పై అమౌంట్ పక్కన ‘Only’ ఎందుకు రాస్తారు?

ఈ డౌట్ మీకు వచ్చిందా? ఉదాహరణకు చెక్పై రూ.1,00,000 ఇలా రాసిన తర్వాత ONE Lakh Rupees Only రాయడం గమనించే ఉంటారు. చెక్ ట్యాంపర్ అవ్వకుండా, మనం రాసిన అమౌంట్ పక్కన నంబర్లు చేర్చకుండా ఉండేందుకు ఓన్లీ అని రాయడం ముఖ్యం. పదాలలో రాసి చివర ఓన్లీ అని రాయడం వల్ల సంఖ్యను మార్చినా, పదాలను ఛేంజ్ చేయలేదు. ఒకవేళ కొట్టేసి రాసినా అలాంటి చెక్కులను బ్యాంకులు అంగీకరించవు. మోసాలను నివారించడానికి Only మస్ట్.
Similar News
News December 15, 2025
స్టూడెంట్స్ సంఖ్య ఆధారంగానే ‘కుక్’లు

TG: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి వంట మనుషుల సంఖ్య ఉండాలని DEOలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లలో 25 మంది స్టూడెంట్స్ ఉంటే కుక్ కమ్ హెల్పర్ను, 26-100 మధ్య ఉంటే ఇద్దరు హెల్పర్లు, 101-200 మధ్య ఉంటే ముగ్గురు హెల్పర్లను తీసుకోవాలన్నారు. ఆపై ప్రతి 100 మందికి ఒక అదనపు హెల్పర్ను నియమించుకోవచ్చన్నారు. సంబంధిత బిల్లులు ఆన్లైన్ ద్వారా క్లైయిమ్ చేయాలని తెలిపారు.
News December 15, 2025
స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

AP: గ్రామ, వార్డు సచివాలయాల నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను ఫ్రీగా తీసుకోవడానికి ఇవాళే చివరి తేదీ. ఇప్పటికీ తీసుకోకపోతే ఆ కార్డులను కమిషనరేట్కు పంపుతారు. అయితే రేషన్కార్డుదారులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. సచివాలయాల్లో రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఇంటికే పంపిస్తామని అధికారులు తెలిపారు. ATM తరహాలోని ఈ కార్డులపై ఉండే QR కోడ్ను స్కాన్ చేస్తే కుటుంబం పూర్తి వివరాలు తెలుస్తాయి.
News December 15, 2025
నేడు ప్రధానితో మెస్సీ భేటీ

గోట్ టూర్లో భాగంగా నేటితో మెస్సీ భారత పర్యటన ముగియనుంది. ఇవాళ ఢిల్లీ పర్యటనలో ఓ హోటల్లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని PM మోదీతో భేటీ అవుతారు. అనంతరం జాతీయ ఫుట్బాల్ సంఘం మాజీ చీఫ్ ప్రఫుల్ పటేల్ నివాసంలో CJI జస్టిస్ సూర్యకాంత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తదితరులను కలవనున్నారు. 3.30pmకి ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి వెళ్లి సినీ, క్రీడా ప్రముఖులతో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడతారు.


