News July 15, 2024

Xiaomi క్రేజ్ ఎందుకు తగ్గిందంటే? – 2/2

image

పబ్లిక్ మిడ్ రేంజ్, ప్రీమియం రేంజ్ స్మార్ట్‌ఫోన్లకు ఆసక్తి చూపిస్తోందనే ట్రెండ్‌ను షావోమీ ఆలస్యంగా పసిగట్టిందనేది బిజినెస్ వర్గాల మాట. దీనిని శాంసంగ్, ఒప్పో, వివో వంటి బ్రాండ్లు క్యాష్ చేసుకున్నాయని చెబుతున్నాయి. గతంలో జరిగిన బాయ్‌కాట్ ట్రెండ్, అవకతవకలకు పాల్పడిందని $1 బిలియన్ విలువ చేసే ఆస్తులను ఈడీ ఫ్రీజ్ చేయడం, సంస్థ వృద్ధికి కీలకమైన మను జైన్ వైదొలగడం కూడా పతనానికి కారణం అయ్యాయని చెబుతున్నారు.

Similar News

News November 3, 2025

చేవెళ్ల ప్రమాదం.. డ్రైవర్‌కు యాక్సిడెంట్ రికార్డు లేదు: TGSRTC

image

TG: చేవెళ్ల సమీపంలో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గతంలో ఎలాంటి యాక్సిడెంట్ రికార్డు లేనట్టు తేలిందని TGSRTC వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక విచారణ అనంతరం ప్రమాదానికి ఆర్టీసీ బస్సు, డ్రైవర్ కారణం కాదని తెలుస్తోందని ఓ ప్రకటనలో తెలిపింది. రోడ్డు మలుపు వద్ద అతి వేగంతో ఉన్న టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పేర్కొంది.

News November 3, 2025

చెత్తవేసే వారి ఫొటోలు పంపిస్తే ₹250 నజరానా

image

నగర పరిశుభ్రతలో పౌరుల భాగస్వామ్యం కోసం గ్రేటర్ బెంగళూరు అథారిటీ, BSWML కొత్త స్కీమ్‌ చేపట్టాయి. రోడ్లపై చెత్తవేసే వారి ఫొటో, వీడియో తీసి పంపిస్తే ₹250 చెల్లిస్తామని ప్రకటించాయి. త్వరలోనే దీనికోసం డెడికేటెడ్ నంబర్, SM హ్యాండిల్స్‌, ప్రత్యేక యాప్‌ ఏర్పాటు చేయనున్నాయి. కాగా 5వేల ఆటోలతో ఇంటివద్దే చెత్త సేకరిస్తున్నా కొందరు ఇంకా రోడ్లపై వేస్తున్నారని, వారికి ₹2వేల ఫైన్ విధిస్తామని BSWML CEO తెలిపారు.

News November 3, 2025

నిద్రపోయే ముందు రీల్స్ చూస్తున్నారా?

image

చాలామంది రీల్స్ చూస్తూ నిద్రను పాడు చేసుకుంటున్నారని వైద్యులు గుర్తించారు. స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్‌ను అణచివేస్తుందని తెలిపారు. ‘నిరంతర ఉద్దీపన వల్ల మెదడు విశ్రాంతి తీసుకోకుండా చురుకుగా ఉంటుంది. దీని ఫలితంగా నిద్ర నాణ్యత తగ్గి, మరుసటి రోజు బ్రెయిన్ ఫాగ్, చిరాకు పెరుగుతాయి. అందుకే నిద్రకు 30-60 నిమిషాల ముందు రీల్స్, టీవీ చూడకండి’ అని సూచించారు.