News August 14, 2024

ట్యాబ్లెట్లపై ఈ రెడ్ లైన్ ఎందుకు ఉంటుంది?

image

కొన్ని ట్యాబ్లెట్ల వెనకవైపు రెడ్ కలర్ లైన్ ఉంటుంది. ప్రధానంగా యాంటీబయాటిక్స్‌లో కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే ఈ ట్యాబ్లెట్లు వాడటానికి డాక్టర్‌ సలహా తప్పనిసరి. ఇష్టానుసారం ఈ మెడిసిన్ తీసుకుంటే ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. అందుకే మీరు ట్యాబ్లెట్ల ఎక్స్‌పైరీ డేట్‌తో పాటు ఈ రెడ్ లైన్ కూడా గమనించడం ముఖ్యం. > SHARE

Similar News

News December 11, 2025

అప్పుల్లో మునిగినా.. పాక్‌ ఆయుధాల పిచ్చి!

image

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్… అప్పుల కోసం తరచూ IMF తలుపులు తడుతూనే ఉంటుంది. ఇటీవలే <<18510802>>IMF<<>> నుంచి $1.2B రుణం పొందింది. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు ఆ డబ్బును ఆయుధాల కోసం మళ్లించబోతుందనే వార్తలు వస్తున్నాయి. అప్పులు తీర్చేందుకు <<18463979>>ఎయిర్‌లైన్స్‌<<>>ను అమ్మే స్థితికి చేరినా.. ఆయుధాలపై పిచ్చితో US నుంచి $686M విలువైన F16 జెట్ల కొనుగోలుకు ఒప్పుకుంది.

News December 11, 2025

451 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2026కు <>UPSC <<>>నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 451 పోస్టులను భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 19 -24ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.200, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ , మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://upsconline.nic.in.

News December 11, 2025

సర్పంచ్ ఎన్నికలు.. ఆ గ్రామంలో 40,761 ఓట్లు

image

TG: ఇవాళ తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగియడంతో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. అయితే రాష్ట్రంలో ఏకంగా 40వేల ఓట్లున్న మేజర్ గ్రామపంచాయతీపై అందరి దృష్టి నెలకొని ఉంది. అదే ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం. ఇక్కడ 20 వార్డులుండగా 40,761 మంది ఓటర్లున్నారు. ST జనరల్‌కు రిజర్వ్‌డ్ కాగా సర్పంచ్ స్థానానికి ఐదుగురు, వార్డుల అభ్యర్థులుగా 75 మంది బరిలో ఉన్నారు. భద్రాచలంలో కౌంటింగ్ రాత్రి వరకు జరిగే అవకాశం ఉంది.