News August 14, 2024

ట్యాబ్లెట్లపై ఈ రెడ్ లైన్ ఎందుకు ఉంటుంది?

image

కొన్ని ట్యాబ్లెట్ల వెనకవైపు రెడ్ కలర్ లైన్ ఉంటుంది. ప్రధానంగా యాంటీబయాటిక్స్‌లో కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే ఈ ట్యాబ్లెట్లు వాడటానికి డాక్టర్‌ సలహా తప్పనిసరి. ఇష్టానుసారం ఈ మెడిసిన్ తీసుకుంటే ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. అందుకే మీరు ట్యాబ్లెట్ల ఎక్స్‌పైరీ డేట్‌తో పాటు ఈ రెడ్ లైన్ కూడా గమనించడం ముఖ్యం. > SHARE

Similar News

News December 20, 2025

బడ్జెట్‌లో మీకేం కావాలి? ప్రభుత్వానికి సలహా ఇవ్వండి..!

image

కేంద్ర బడ్జెట్ 2026 కోసం భారత ప్రభుత్వం ప్రజల నుంచి సలహాలు కోరుతోంది. దేశాభివృద్ధికి, కొత్త రూల్స్ తయారీకి మీ ఐడియాలను పంచుకోవాలని MyGovIndia Xలో పోస్ట్ చేసింది. అందరికీ ఉపయోగపడేలా బడ్జెట్ ఉండాలనేది ప్రభుత్వ ప్లాన్. ఆసక్తి ఉన్నవారు <>MyGov వెబ్‌సైట్‌కి<<>> వెళ్లి తమ అభిప్రాయాలను పంపొచ్చు. మీ సలహాతో దేశం కోసం మంచి పాలసీలు రూపొందించే ఛాన్స్ ఉంటుంది. మీరేం సలహా ఇస్తారో కామెంట్ చేయండి.

News December 20, 2025

వేంకన్న గుడికి గువాహటిలో 25 ఎకరాలు

image

AP: గువాహటిలో TTD ఆలయం కోసం 25 ఎకరాలు ఇచ్చేందుకు అస్సాం CM హిమంత బిశ్వశర్మ ఆమోదం తెలిపారు. ‘గతంలో వేరే పట్టణాల్లో స్థలం ఇస్తామన్నారు. అయితే రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాలు నిర్మించాలన్నది ఆశయమని, ఈశాన్య భారతానికి కేంద్రంగా ఉన్న గువాహటిలో స్థలం కేటాయించాలని CM CBN అస్సాం CMకు లేఖ రాశారు’ అని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. భూమితో పాటు ఆర్థిక సహకారం అందించడానికి హిమంత అంగీకరించారని చెప్పారు.

News December 20, 2025

ఆయుష్ మార్క్ అంటే ఏమిటి?

image

బంగారం, వస్త్రాలు, అగ్రి ఉత్పత్తులు, మెడిసిన్ నాణ్యతను ధ్రువీకరించేందుకు హాల్ మార్క్, ISI, AGMARK, GMP లాంటి గుర్తులున్నాయి. ఇదే తరహాలో ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, సిద్ధ, యునాని, హోమియోపతి ఉత్పత్తులు, సేవల క్వాలిటీని Ayush Mark ద్వారా గుర్తించవచ్చు. 2009 నుంచే ఇది ఉన్నప్పటికీ గ్లోబల్ స్థాయి గుర్తింపు కోసం మోదీ సరికొత్తగా ప్రారంభించారు. ఇలాంటి వైద్యానికి వెళ్లినప్పుడు ఈ మార్క్‌ను గుర్తుంచుకోండి.