News May 4, 2024
అభ్యర్థుల ఖర్చుపై పరిమితి ఎందుకు?

ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచే అవకాశం అందరికీ సమానంగా కల్పించాలనే ఉద్దేశంతో వ్యయ పరిమితిని EC విధించింది. 1952 తొలి లోక్సభ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి ఖర్చు పెద్ద రాష్ట్రాల్లో గరిష్ఠంగా ₹25వేలు, చిన్న రాష్ట్రాల్లో ₹10వేలు. యాడ్స్, పోస్టర్లు, బ్యానర్లు, ప్రచారం, సభలు, వాహనాల వినియోగం ఇందులోకే వస్తాయి. ద్రవ్యోల్బణం, పెరిగిన ఖర్చును పరిగణనలోకి తీసుకుని EC వ్యయ పరిమితిని సవరిస్తూ ఉంటుంది.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News December 30, 2025
సంక్రాంతికి టోల్ప్లాజాల వద్ద రద్దీ లేకుండా చర్యలు: కోమటిరెడ్డి

TG: టోల్ ప్లాజాల వద్ద రద్దీ లేకపోతే అసౌకర్యం ఉండదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతికి నేషనల్ హైవేలపై రద్దీ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన సమీక్షించారు. ‘CM ఈ అంశంపై సీరియస్గా ఉన్నారు. సంక్రాంతికి టోల్ ప్లాజాల వద్ద ఫ్రీ వే ఏర్పాటుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాస్తాను. మేడారం జాతరకు వెళ్లే లక్షలాది భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలని కోరతాను’ అని తెలిపారు.
News December 30, 2025
సూర్యకుమార్ మెసేజ్ చేసేవాడు.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు!

టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై ‘MTV స్ప్లిట్స్విల్లా’ ఫేమ్ ఖుషీ ముఖర్జీ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో సూర్య తనకు తరచూ మెసేజ్ చేసేవాడని తెలిపారు. ప్రస్తుతం ఇద్దరం మాట్లాడుకోవడం లేదని చెప్పారు. ఏ క్రికెటర్తోనైనా డేటింగ్ చేయాలనుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. తన వెనుక చాలామంది పడుతున్నారని.. కానీ తాను ఎవరితోనూ అసోసియేట్ అవ్వాలనుకోవడం లేదని అనడం ఇప్పుడు SMలో వైరల్గా మారింది.
News December 30, 2025
సంక్రాంతికి మరో 11 స్పెషల్ ట్రైన్స్: SCR

సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 11 స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) ప్రకటించింది. జనవరి 7 నుంచి జనవరి 12 మధ్య ఇవి రాకపోకలు సాగించనున్నాయి. కాకినాడ టౌన్-వికారాబాద్, వికారాబాద్-పార్వతీపురం, పార్వతీపురం-వికారాబాద్, పార్వతీపురం-కాకినాడ టౌన్, సికింద్రాబాద్-పార్వతీపురం, వికారాబాద్-కాకినాడ మధ్య ఈ ట్రైన్స్ నడవనున్నాయి. వీటికి బుకింగ్స్ ప్రారంభమైనట్లు తెలిపింది.


