News October 22, 2024
మంగళవారమే ఓటింగ్ ఎందుకు?

అమెరికాలో 170 సంవత్సరాలుగా నవంబర్లో మొదటి మంగళవారమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 1800లలో USలో ఎక్కువగా రైతులే ఉండేవారు. పంట కోతల తర్వాత చలికాలానికి ముందు ఎన్నికలు జరిపేందుకు నవంబర్ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఓటర్లు ఆదివారం ప్రయాణాన్ని ఇష్టపడనందున సోమవారం ప్రయాణించి, మంగళవారం ఓటేస్తారని ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ, ప్రస్తుత ఉద్యోగ పరిస్థితుల దృష్ట్యా వీకెండ్స్లో ఓటింగ్ నిర్వహించాలంటున్నారు.
Similar News
News November 11, 2025
ఆత్మహత్య ఘటనలో ఇద్దరికి రిమాండ్: ఎస్ఐ

నందిగం మండలం తురకలకోట గ్రామానికి చెందిన ఎం.వెంకటరావు(34) అనే వ్యక్తి శనివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు నందిగం పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటరావును వేధించిన పెట్రోల్ బంక్ యజమాని బీ.రమేశ్తో పాటు అతనికి సహకరించిన ఒక హెడ్ కానిస్టేబుల్ ఇరువురుని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నందిగం ఎస్ఐ షేక్ మహమ్మద్ అలీ తెలిపారు.
News November 11, 2025
‘ఓం శాంతి శాంతి శాంతిః’ అంటే అర్థం తెలుసా?

ప్రతి మంత్రాన్ని ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అని ముగిస్తుంటాం. అంటే సమస్త దుఃఖాల నుంచి విముక్తి ప్రసాదించమని ఈశ్వరుడిని వేడుకోవడం. ఇందులో మూడు సార్లు ‘శాంతిః’ అని పలకడం ద్వారా మానవులను పీడించే త్రివిధ తాపాల నుంచి ఉపశమనం కోరడం. ఈ మూడు రకాల బాధలను దాటినప్పుడే మనకు మోక్షం, శాంతి లభిస్తాయని వేదాలు చెబుతున్నాయి. ☞ మరి ఆ మూడు రకాల తాపాలేంటి?, వాటి నుంచి ఎలా విముక్తి పొందాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News November 11, 2025
అనారోగ్యం దూరమవ్వాలంటే?

త్రివిధ తాపాల్లో మొదటిది ఆధ్యాత్మిక తాపం. ఈ బాధలు మనకు శరీరం, మనస్సు వలన అంతర్గతంగా కలుగుతాయి. అనారోగ్యం, సోమరితనం, కోరికలు, కోపం, అహంకారం వంటి దుర్గుణాలు ఇందులోకి వస్తాయి. ఈ బాధల నుంచి విముక్తి పొందడానికి ధ్యానం ఉత్తమ మార్గం. యోగాభ్యాసం, మనస్సుపై ఏకాగ్రత, ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా అంతరంగంలో శాంతిని పొందవచ్చు. స్వీయ నియంత్రణ సాధించి, దుర్గుణాలను జయిస్తే ఆధ్యాత్మిక దుఃఖాలు తొలగిపోతాయి.


