News April 28, 2024
వరల్డ్కప్నకు ఎంపికవ్వకపోతే బాధపడతా: గిల్

టీ20 వరల్డ్ కప్నకు భారత జట్టును ఈ నెలాఖరులోపుగానే ప్రకటించనున్నారు. ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్నే ఎంపిక చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో శుభ్మన్ గిల్ స్పందించారు. ‘గత ఏడాది ఐపీఎల్లో 900 పరుగులు చేశాను. వన్డే ప్రపంచ కప్ ఆడాను. టీ20 వరల్డ్కప్లోనూ ఆడితే మరో కల తీరినట్లే. జట్టులో ఉంటానన్న నమ్మకం ఉంది. ఎంపికవ్వకపోతే బాధపడతా. కానీ ఏదేమైనా భారత జట్టుకు అండగా ఉంటా’ అని తెలిపారు.
Similar News
News December 10, 2025
150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News December 10, 2025
అన్క్లెయిమ్డ్ అమౌంట్.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి: PM

బ్యాంకుల్లో ₹78,000Cr అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయని PM మోదీ తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ₹14KCr, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల వద్ద ₹3KCr మిగిలిపోయాయన్నారు. ఖాతాదారులు/ఫ్యామిలీ మెంబర్స్ ఈ మనీని క్లెయిమ్ చేసుకునేందుకు ‘యువర్ మనీ, యువర్ రైట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. UDGAM, బీమా భరోసా, SEBI, IEPFA పోర్టల్లలో వీటి వివరాలు తెలుసుకుని సంబంధిత ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు.
News December 10, 2025
ఉప్పల్లో మెస్సీ పెనాల్టీ షూటౌట్

TG: లియోనెల్ మెస్సీ “GOAT టూర్ ఆఫ్ ఇండియా 2025″లో భాగంగా ఈనెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. సింగరేణి RR, అపర్ణ మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా, చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆడతారని నిర్వాహకులు తెలిపారు. పెనాల్టీ షూటౌట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ భారీ ఈవెంట్ కోసం 33,000 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.


