News February 20, 2025

భారత్ గెలుస్తుందా?

image

ఛాంపియన్స్ ట్రోఫీ: భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియాకు ఓపెనర్లు రోహిత్, గిల్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. 10వ ఓవర్లో రోహిత్ ఔటయ్యాక స్కోరులో వేగం తగ్గింది. కోహ్లీ (22), అయ్యర్ (15), అక్షర్ పటేల్ (8) నిరాశపరిచారు. ప్రస్తుతం గిల్ (63*), కేఎల్ రాహుల్ (3*) క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 17 ఓవర్లలో 75 రన్స్ కావాలి.

Similar News

News December 30, 2025

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు షాక్

image

చండీగఢ్ కన్జూమర్ కోర్టు Star హెల్త్ ఇన్సూరెన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ మహిళ సర్జరీకి ₹2.25 లక్షలు ఖర్చవగా Star ₹69K ఇచ్చి మిగతాది మినహాయింపు అని చెప్పింది. దీనిపై కోర్టుకెళ్తే రూల్స్ ఒప్పుకునే పాలసీ తీసుకున్నారని Star వాదించింది. దీంతో కండిషన్స్ కాపీపై వారి సంతకాలేవి? షరతులు క్లెయిమ్ టైంలోనే చెబుతారా? అని కోర్టు మండిపడింది. మొత్తాన్ని 9%వడ్డీతో, మానసిక వేదనకు మరో ₹20K ఇవ్వాలని ఆదేశించింది.

News December 30, 2025

NIT వరంగల్‌లో 45 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

<>NIT<<>> వరంగల్‌లో 45 ఫ్యాకల్టీ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి PhD, ME, MTech, MSc(కెమిస్ట్రీ), MBA, MCA, MA, MCom ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, టీచింగ్/రీసెర్చ్ సెమినార్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.2000, SC, ST, PwDలకు రూ.1000. వెబ్‌సైట్: https://nitw.ac.in/faculty

News December 30, 2025

అక్షితలతో ఇలా చేస్తే ‘ధన లాభం’

image

అక్షితలతో పాటించే ఓ పరిహారంతో ధన లాభం కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు. ‘21 బియ్యం గింజలకు పసుపు రాసి, ఎర్రటి వస్త్రంలో కట్టి లక్ష్మీదేవి వద్ద పూజించి బీరువాలో దాచుకోవాలి. దీనివల్ల ధనలాభం కలుగుతుంది. అలాగే, సోమవారం రోజున కొంత బియ్యాన్ని శివుడి వద్ద ఉంచి, అందులో గుప్పెడు బియ్యంతో స్వామిని అర్చించి, మిగిలినవి పేదలకు దానం చేయాలి. ఫలితంగా గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోతాయి’ అంటున్నారు.