News June 15, 2024
చట్టబద్ధ కమిషన్నే కేసీఆర్ తప్పుబడతారా?: బండి సంజయ్

TG: విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై విచారణకు చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను KCR తప్పుబడతారా? అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ‘తెలంగాణ ఉద్యమంలో జస్టిస్ నర్సింహారెడ్డి నిజాయతీ, ధైర్యసాహసాలను ప్రశంసించారు. మీ తప్పిదాలను ఈఆర్సీపై నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారా? విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరంపై విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోంది’ అని మండిపడ్డారు.
Similar News
News January 22, 2026
త్వరలో 600 మంది వైద్య సిబ్బంది నియామకం: వివేక్

TG: ఈఎస్ఐలో త్వరలో 600 మంది వైద్య సిబ్బందిని నియమించనున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ESIలో పేషంట్లకు ట్రీట్మెంట్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నాచారం ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఆర్సీపురంలో ఐసీయూ ఏర్పాటుకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
News January 22, 2026
వరి పంటకు పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారా?

వరి పిలకల దశలో యూరియాతో పాటు చాలా మంది రైతులు DAP, 20-20-0 వంటి కాంప్లెక్స్ ఎరువులను ఎకరాకు ఒక బస్తా చొప్పున వేస్తుంటారు. ఈ కాంప్లెక్స్ ఎరువులలో ఉండే భాస్వరం కేవలం 20 నుంచి 25 శాతమే మొక్కలకు అందుతుంది. మిగతాది అంతా భూమిలో మొక్కలకు అందని స్థితిలో మారిపోతుంది. దీనికి బదులు ‘నానో డీఏపీ’ని ఎకరాకు అర లీటరు స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News January 22, 2026
CSIRలో సెక్షన్ ఆఫీసర్ పోస్టులు

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్& ఇండస్ట్రియల్ రీసెర్చ్ (<


