News June 15, 2024

చట్టబద్ధ కమిషన్‌నే కేసీఆర్ తప్పుబడతారా?: బండి సంజయ్

image

TG: విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై విచారణకు చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను KCR తప్పుబడతారా? అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ‘తెలంగాణ ఉద్యమంలో జస్టిస్ నర్సింహారెడ్డి నిజాయతీ, ధైర్యసాహసాలను ప్రశంసించారు. మీ తప్పిదాలను ఈఆర్సీపై నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారా? విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరంపై విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోంది’ అని మండిపడ్డారు.

Similar News

News November 25, 2025

సిద్దిపేట జిల్లాలో మూడు విడుతలుగా ఎన్నికలు

image

సిద్దిపేట జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడత హుస్నాబాద్ డివిజన్‌లో నవంబర్ 27న నామినేషన్‌లు ప్రారంభమై డిసెంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. రెండవ విడత సిద్దిపేట డివిజన్‌లో నవంబర్ 30న నామినేషన్‌లు మొదలై డిసెంబర్ 14న పోలింగ్ ఉంది. మూడవ విడత గజ్వేల్ డివిజన్‌లో డిసెంబర్ 3న నామినేషన్‌లు ప్రారంభమై డిసెంబర్ 17న పోలింగ్ జరుగుతుంది.

News November 25, 2025

సిద్దిపేట జిల్లాలో మూడు విడుతలుగా ఎన్నికలు

image

సిద్దిపేట జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడత హుస్నాబాద్ డివిజన్‌లో నవంబర్ 27న నామినేషన్‌లు ప్రారంభమై డిసెంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. రెండవ విడత సిద్దిపేట డివిజన్‌లో నవంబర్ 30న నామినేషన్‌లు మొదలై డిసెంబర్ 14న పోలింగ్ ఉంది. మూడవ విడత గజ్వేల్ డివిజన్‌లో డిసెంబర్ 3న నామినేషన్‌లు ప్రారంభమై డిసెంబర్ 17న పోలింగ్ జరుగుతుంది.

News November 25, 2025

వాస్తు శాస్త్రం ప్రకారం.. పడక గది ఏ దిశలో ఉంటే మంచిది?

image

ఇంటి విస్తీర్ణంతో సంబంధం లేకుండా పెద్దవారి ప్రధాన పడక గది నైరుతి దిశలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పిల్లల గది వాయువ్య దిశలో ఉండటం మంచిదని చెబుతున్నారు. ‘ఈ దిశల అమరిక నిద్ర నాణ్యతను పెంచుతుంది. నిద్ర సుఖాన్ని మెరుగుపరుస్తుంది. నైరుతి స్థిరత్వాన్ని ఇవ్వగా, వాయువ్యం చైతన్యానికి మద్దతునిస్తుంది’ అని ఆయన వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>