News March 21, 2024

కేజ్రీవాల్‌ను కవితతో కలిపి విచారిస్తారా?

image

కొందరు ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చిందన్నది ED ఆరోపణ. ‘సౌత్ గ్రూప్ అనే పేరుతో కవిత, శరత్‌చంద్రారెడ్డి తదితరులు సిండికేట్‌గా ఏర్పడి ఈ పాలసీ ద్వారా లబ్ధి పొందారు. అందుకు ఆప్ ప్రభుత్వానికి లంచాలు ముట్టాయి’ అని వాదిస్తోంది. ఈ కేసులో నిందితులుగా చెబుతున్న కేజ్రీవాల్‌, కవిత, సిసోడియాను కలిపి విచారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News July 5, 2024

కొలెస్ట్రాల్ తగ్గించే ఇంజెక్షన్లు ఇన్సూరెన్స్‌లో కవర్ అవుతాయా?

image

కొలెస్ట్రాల్ తగ్గించే కాస్ట్లీ ఇంజెక్షన్లు భారత్‌లోనూ రానున్న నేపథ్యంలో ఇవి ఇన్సూరెన్స్‌ పరిధిలోకి వస్తాయా? లేదా? అనేది చర్చనీయాంశమైంది. ‘కేంద్రం ఆమోదంతో ఈ చికిత్స హెల్త్ ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చినా ఆస్పత్రి ఖర్చులే కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంజెక్షన్ ఖర్చును (₹1.25లక్షలు) పేషెంటే భరించాలి. చికిత్సకు ముందు మీ ఇన్సూరర్‌ను సంప్రదించడం లేదా పాలసీ చెక్‌ చేసుకోవడం మంచిది’ అని నిపుణులు సూచిస్తున్నారు.

News July 5, 2024

‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ డేట్ ఫిక్స్?

image

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఆగస్టు 15న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 14న ప్రీమియర్స్ వేయనున్నట్లు సమాచారం. దీనిపై మూవీ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వాల్సి ఉంది. హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.

News July 5, 2024

BREAKING: ‘నీట్’ రద్దు చేయలేం: కేంద్రం

image

నీట్ పరీక్షలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లకు సమాధానంగా అఫిడవిట్ వేసింది. ‘పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తే నిజాయితీగా ఎగ్జామ్ రాసిన లక్షలాది మంది విద్యార్థులకు నష్టం కలుగుతుంది. పారదర్శకంగా పోటీ పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉన్నాం. నీట్ లీకేజీలో నిందితులను అరెస్ట్ చేశాం. CBI దర్యాప్తునకు ఆదేశించాం’ అని పేర్కొంది.