News January 21, 2025

సాగర్ డ్యామ్ నిర్వహణ ఏపీకి ఇవ్వం: తెలంగాణ

image

నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణ ఏపీకి ఇవ్వమని తెలంగాణ నీటిపారుదలశాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జా KRMB సమావేశంలో స్పష్టం చేశారు. సాగర్ పర్యవేక్షణ నుంచి CRPF బలగాలు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. నదీ జలాల వాటా పెంచాలని కోరారు. 79-21 వాటాల ప్రకారం నీటిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అప్పటివరకు 50-50 పద్ధతిలో నీటిని విడుదల చేయాలని పేర్కొన్నారు. నదీ జలాల మళ్లింపు విషయంలో కలగజేసుకోవాలని బోర్డును కోరారు.

Similar News

News November 21, 2025

NGKL: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశం కల్పించాలి: ఎంపీ

image

పార్లమెంటు పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేసి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గ్రామీణ బ్యాంకు అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. యువత ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకు రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని కోరారు.

News November 21, 2025

జొమాటో, స్విగ్గీ కస్టమర్లకు షాక్!

image

తమ కస్టమర్ల డేటాను లక్షలాది రెస్టారెంట్లతో పంచుకోవాలని జొమాటో, స్విగ్గీలు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే జొమాటో పైలట్ ప్రాజెక్టు కింద ‘పర్మిషన్’ పాప్ అప్ మెసేజ్‌లను పంపుతోంది. దానిపై క్లిక్ చేస్తే మీ డేటా రెస్టారెంట్లకు చేరుతుంది. త్వరలో ఆటోమేటిక్‌ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇకపై అన్‌వాంటెడ్ మెసేజ్‌లు ఇన్‌బాక్స్‌లను ముంచెత్తనున్నాయి. అలాగే డేటా గోప్యతకు భంగం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు.

News November 21, 2025

FEB 15న భారత్-పాకిస్థాన్ మ్యాచ్?

image

వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌లో మరోసారి భారత్-పాక్ తలపడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉందని క్రీడా వర్గాలు తెలిపాయి. IND సెమీస్‌కు క్వాలిఫై అయితే వాంఖడేలో మార్చి 5న ప్రత్యర్థితో మ్యాచ్ ఆడనుందని పేర్కొన్నాయి. అలాగే FEB 7న టోర్నీ ప్రారంభమై అహ్మదాబాద్‌లో మార్చి 8న ఫైనల్‌తో ముగుస్తుందని వెల్లడించాయి. ఇటీవల T20IWC <<18244536>>వేదికలను<<>> ఖరారు చేసిన విషయం తెలిసిందే.