News January 21, 2025

సాగర్ డ్యామ్ నిర్వహణ ఏపీకి ఇవ్వం: తెలంగాణ

image

నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణ ఏపీకి ఇవ్వమని తెలంగాణ నీటిపారుదలశాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జా KRMB సమావేశంలో స్పష్టం చేశారు. సాగర్ పర్యవేక్షణ నుంచి CRPF బలగాలు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. నదీ జలాల వాటా పెంచాలని కోరారు. 79-21 వాటాల ప్రకారం నీటిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అప్పటివరకు 50-50 పద్ధతిలో నీటిని విడుదల చేయాలని పేర్కొన్నారు. నదీ జలాల మళ్లింపు విషయంలో కలగజేసుకోవాలని బోర్డును కోరారు.

Similar News

News February 19, 2025

‘బుక్’ పాలిటిక్స్

image

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు TDP జాతీయ ప్రధాని కార్యదర్శి లోకేశ్ ‘రెడ్’ బుక్ మెయింటేన్ చేస్తున్నామని ప్రకటించారు. తమను ఇబ్బంది పెట్టిన వారి భరతం పడతామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న BRS MLC కవిత కూడా ఇటీవల ‘పింక్’ బుక్‌ అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా BJP MP ఈటల ‘కాషాయ’ బుక్ మెయింటేన్ చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై మీ కామెంట్?

News February 19, 2025

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోకి నకిలీ పోలీస్

image

TG: కానిస్టేబుల్‌ని అంటూ ఓ వ్యక్తి పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌లోకి ప్రవేశించాడు. గోవర్ధన్ అనే అతను కానిస్టేబుల్ అని చెప్పి జ్ఞాన సాయి ప్రసాద్ అనే వ్యక్తి నుంచి రూ.3లక్షలు తీసుకున్నాడు. అతణ్ని నమ్మించడానికి CM సమీక్ష జరుగుతున్నప్పుడే CCCలోకి వెళ్లి వచ్చాడు. ఆపై అతను కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు CCTV ఫుటేజ్ పరిశీలించగా నిందితుడి చిత్రాలు నమోదయ్యాయి.

News February 19, 2025

మోదీని కలిసిన రిషి సునాక్ ఫ్యామిలీ

image

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ కుటుంబ సమేతంగా కలిశారు. వారి వెంట సునాక్ అత్త, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి కూడా ఉన్నారు. గత కొన్ని రోజులుగా బ్రిటన్ మాజీ ప్రధాని ఫ్యామిలీతో కలిసి భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

error: Content is protected !!