News December 14, 2024

పార్లమెంటు నాదవుతుందా?: ఒవైసీ

image

దేశవ్యాప్తంగా పలు మసీదుల కూల్చివేతకు కుట్ర జరుగుతోందని MIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ‘500 ఏళ్ల క్రితం మసీదు ఉందా అని అడుగుతున్నారు. మరి పార్లమెంటు కింద నాకు సంబంధించిన వస్తువు దొరికితే పార్లమెంటు నాదవుతుందా?’ అని ప్రశ్నించారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల్ని భారత ముస్లింలపై ద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు కొంతమంది వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News November 26, 2025

సర్పంచ్ ఎన్నికలు.. హైకోర్టులో పిటిషన్లు

image

తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై పలు గ్రామాల ప్రజలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదని అందులో పేర్కొన్నారు. వరంగల్, సంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లోని గ్రామాల్లో సర్పంచ్, వార్డు రిజర్వేషన్లను సవాల్ చేశారు. దీనిపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

News November 26, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు PMను ఆహ్వానించాలి: సీఎం

image

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభోత్సవానికి PM మోదీ, కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని CM రేవంత్ రెడ్డి సూచించారు. పెట్టుబడులపై ఒప్పందాల విషయంలో ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. వివిధ విభాగాలపై స్టాల్స్, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సమీక్షలో పేర్కొన్నారు. 2,600 మందికి ఆహ్వానం అందించామని CMకు అధికారులు తెలియజేశారు.

News November 26, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు PMను ఆహ్వానించాలి: సీఎం

image

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభోత్సవానికి PM మోదీ, కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని CM రేవంత్ రెడ్డి సూచించారు. పెట్టుబడులపై ఒప్పందాల విషయంలో ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. వివిధ విభాగాలపై స్టాల్స్, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సమీక్షలో పేర్కొన్నారు. 2,600 మందికి ఆహ్వానం అందించామని CMకు అధికారులు తెలియజేశారు.