News December 2, 2024

కనీసం మరో రెండేళ్లైనా ఆడతాను: పీవీ సింధు

image

బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సయ్యద్ మోదీ టోర్నమెంట్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రెస్‌మీట్‌లో తన రిటైర్మెంట్ వార్తలపై ఆమె స్పందించారు. ‘ఈ విజయం చాలా విశ్వాసాన్నిచ్చింది. 29 ఏళ్లు వచ్చేశాయి. అంటే చాలా అనుభవం వచ్చినట్లే. దీన్ని ఉపయోగించుకుని ముందుకెళ్తాను. కనీసం మరో రెండేళ్లు ఆడతాను. గాయాలపాలవ్వకుండా ఉండటమే ప్రధాన లక్ష్యం. ఫిట్‌గా ఉంటే వచ్చే ఒలింపిక్స్ కూడా ఆడతాను’ అని పేర్కొన్నారు.

Similar News

News February 11, 2025

కృష్ణా జిల్లాలోనూ బర్డ్‌ఫ్లూ.. చికెన్, గుడ్లు తినొద్దని అధికారుల ఆదేశాలు

image

AP: ఉ.గో జిల్లాల్లో కల్లోలం సృష్టిస్తోన్న <<15428552>>బర్డ్ ఫ్లూ<<>> కృష్ణా జిల్లాకూ విస్తరించింది. గంపలగూడెం(M)లో వైరస్ నిర్ధారణ అయ్యింది. 2 రోజుల్లోనే 10వేలకు పైగా కోళ్లు మృతి చెందాయి. వైరస్ సోకిన కోళ్లను నాశనం చేయాలని అధికారులు ఆదేశించారు. ఆ చుట్టుపక్కల 10KM పరిధిలో చికెన్, గుడ్లు తినొద్దని ప్రజలకు సూచించారు. కాగా 100డిగ్రీల ఉష్ణోగ్రతలో మాంసాన్ని ఉడికిస్తే ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు.

News February 11, 2025

18వేల ఏళ్ల క్రితం యూరప్‌లో నరమాంస భక్షణ

image

సుమారు 18వేల ఏళ్ల క్రితం యూరప్‌లో నరమాంస భక్షణ జరిగేదని UK పరిశోధకులు తెలిపారు. పోలాండ్‌లోని ఓ గుహలో దొరికిన అవశేషాలపై అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందన్నారు. ‘ఆ ఎముకల మీద ఉన్న గుర్తుల్ని బట్టి అవి నరమాంస భక్షణకు గురైనట్లుగా గుర్తించాం. కాళ్లూచేతుల్ని ముక్కలుగా నరకడం, మెదడును బయటికి తీయడం వంటి పలు ఆనవాళ్లు వాటిపై ఉన్నాయి. 2 గ్రూపుల మధ్య యుద్ధంలో విజేతలు ఓడినవారిని తినేసి ఉండొచ్చు’ అని అంచనా వేశారు.

News February 11, 2025

ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి

image

జమ్మూకశ్మీర్‌లోని ఎల్‌వోసీ వద్ద ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మరణించగా మరికొందరు గాయపడ్డారు. అఖ్నూర్ సెక్టార్‌లోని ఫెన్సింగ్ వద్ద భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది.

error: Content is protected !!