News June 14, 2024
నీట్ స్కామ్ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతాం: YCP MP

NEET UG పరీక్షల్లో జరిగిన అవకతవకలపై కేంద్రం స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని YCP తిరుపతి MP మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. ‘తమకు న్యాయం చేయాలని కోరుతూ ఫ్యూచర్ డాక్టర్లు రోడ్లపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై NTA, కేంద్ర వైద్యారోగ్యశాఖ, అమిత్షా దృష్టిసారించి త్వరగా పరిష్కరించాలి. దేశం & ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశాన్ని మేము పార్లమెంటులో లేవనెత్తుతాం’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News November 25, 2025
కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

గువాహటిలోని <
News November 25, 2025
టీమ్ ఇండియాకు షాక్.. 2 వికెట్లు డౌన్

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో 549 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 21 రన్స్కే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. యశస్వీ జైస్వాల్ 13, కేఎల్ రాహుల్ 6 పరుగులకే ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. జాన్సెన్, హార్మర్ తలో వికెట్ తీశారు. భారత్ విజయానికి మరో 527 రన్స్ కావాలి.
News November 25, 2025
BJP నన్ను రాజకీయంగా ఓడించలేదు: మమత

బీజేపీ రాజకీయంగా పోరాడి తనను ఓడించలేదని బెంగాల్ CM మమతా బెనర్జీ అన్నారు. ఈసీ నిష్పాక్షిక సంస్థ కాదని, ‘BJP కమిషన్’గా మారిపోయిందని ఆరోపించారు. బొంగావ్లో యాంటీ SIR ర్యాలీలో ఆమె మాట్లాడారు. బిహార్లో NDA ఆటను ప్రతిపక్షాలు అంచనా వేయలేకపోయాయని చెప్పారు. ఇంత తొందరగా SIR నిర్వహించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఓట్ల జాబితా నిజమైనది కాకపోతే, 2024లో బీజేపీ గెలుపు కూడా నిజమైనది కాదని ఆరోపించారు.


