News January 3, 2025
మళ్లీ రీచార్జ్ ధరలు తగ్గుతాయా?
ప్రముఖ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా (Vi) 5G మొబైల్ బ్రాడ్బ్యాండ్ సేవలను ఈ మార్చిలో ప్రారంభించేందుకు సిద్ధమైంది. తన ప్రత్యర్థులైన జియో, ఎయిర్టెల్కు గట్టి పోటీ ఇచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకోనుందని ఎకనామిక్ టైమ్స్ (ET) తెలిపింది. 5G ప్లాన్లను ఎంట్రీ లెవల్స్లో 15% వరకు చౌకగా అందించనున్నట్లు పేర్కొంది. ఇది జరిగితే టెలికం రంగంలో పెను మార్పులు సంభవించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Similar News
News January 13, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ: సౌతాఫ్రికా టీమ్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం సౌతాఫ్రికా టీంను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
టీమ్: టెంబా బవుమా (C), ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జి, వన్ డర్ డస్సెన్, రికెల్టన్, డేవిడ్ మిల్లర్, మార్క్రమ్, ముల్డర్, క్లాసెన్, కేశవ్ మహారాజ్, షంసీ, ఎంగిడి, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, నోర్ట్జే.
News January 13, 2025
తల్లి ఫోన్లో పోర్న్ వీడియో చూసి దారుణం!
AP: అనకాపల్లి జిల్లా ఏటికొప్పాకలో ఐదేళ్ల చిన్నారిని 13 ఏళ్ల బాలుడు (8వ తరగతి) అత్యాచారం చేశాడు. శనివారం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. తల్లి ఫోన్లో పోర్న్ వీడియో చూసి అత్యాచారానికి పాల్పడ్డట్లు బాలుడు పోలీసులతో చెప్పినట్లు సమాచారం.
News January 13, 2025
TTDలో సమన్వయ లోపం లేదు: ఛైర్మన్, ఈవో
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని భక్తులకు TTD ఛైర్మన్ BR నాయుడు సూచించారు. ఏర్పాట్లలో లోపాలున్నాయని ప్రచారం చేయడం సరికాదని అన్నారు. TTD ఛైర్మన్, EOకు పడటం లేదని, బోర్డులో సమన్వయ లోపం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని EO శ్యామలరావు ఖండించారు. తిరుపతిలోని ఓ స్కూల్ వద్ద జరిగిన ఘటనను తిరుమలలో జరిగినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.