News December 27, 2024

రోహిత్ శర్మ రిటైర్ అవుతారా?

image

భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఫామ్‌లేమితో ఆయన ఇబ్బందిపడుతున్నారు. ఆసీస్‌తో BGT సిరీస్‌లో ఇంతవరకు అతడు ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడలేదు. బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనూ 3 పరుగులకే ఔట్ కావడంతో అతడి ఆటతీరుపై ఫ్యాన్స్‌లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. దీంతో కెప్టెన్సీని ఇతరులకు రోహిత్ అప్పగించాలని, లేదంటే టెస్టులకు వీడ్కోలు పలకాలనే డిమాండ్ వినిపిస్తోంది.

Similar News

News December 16, 2025

పది పరీక్షల్లో జిల్లాను అగ్రగామిగా నిలపాలి: DEO

image

గుంటూరు జిల్లాను రానున్న 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలని జిల్లా విద్యాశాఖ అధికారి సలీమ్ బాషా సూచించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని PPD, SJR మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్స్‌ని మంగళవారం DEO పరిశీలించారు. 10వ తరగతి స్లిప్ టెస్ట్ పరీక్షా పత్రాలను పరీక్షించారు. ప్రతి పాఠశాలలో 100 రోజుల ప్రణాళికలు అమలవ్వాలని ఆదేశించారు. ఆయన వెంట మండల విద్యాశాఖాధికారి అబ్దుల్ ఖుద్దూస్ ఉన్నారు.

News December 16, 2025

జీడిమామిడిలో బూడిద తెగులు – నివారణ ఎలా?

image

జీడిమామిడి తోటల్లో పూత దశలో వివిధ రకాల తెగుళ్లు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పొడి వాతావరణం ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువగా పూతను ఆశిస్తుంది. లేత చిగుర్లను, పూతను బూడిద తెగులు ఆశించి ఎండిపోయేలా చేసి పంటను నష్టపరుస్తుంది. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి సల్ఫర్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ట్రై డేమోర్ప్ 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.

News December 16, 2025

కానుకల లెక్కింపులో టెక్నాలజీ వాడాలి: హైకోర్టు

image

AP: పరకామణి నేరం దొంగతనం కన్నా మించినదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘కానుకల లెక్కింపులో టెక్నాలజీ వినియోగించాలి. తప్పిదం జరిగితే తక్షణం అప్రమత్తం చేసేలా అది ఉండాలి. లెక్కింపును మానవరహితంగా చేపట్టాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యత ఉండదు. అందువల్లనే పరకామణి ఘటన జరిగింది’ అని పేర్కొంది. కానుకల లెక్కింపునకు భక్తులను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. పరకామణిలో టేబుళ్లు ఏర్పాటుచేయాలని సూచించింది.