News June 11, 2024
పౌర విమానయానం అభివృద్ధి చెందేలా చూస్తాను: KRN

AP: తనకు పౌరవిమానయాన శాఖ కేటాయింపుపై శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ‘విమానయాన శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, చంద్రబాబుకు నా కృతజ్ఞతలు. నా వంతుగా కృషి చేసి దేశంలో పౌర విమానయానం అభివృద్ధి చెందేలా చూస్తాను’ అని ట్వీట్ చేశారు. మోదీ, చంద్రబాబు ఫొటోలు, తండ్రి ఎర్రన్నాయుడు విగ్రహం ఉన్న ఫొటోను KRN షేర్ చేశారు.
Similar News
News March 26, 2025
భారతీయులకు బంపరాఫర్.. విమాన టికెట్లపై 30 శాతం డిస్కౌంట్

యూఏఈకి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్ భారతీయుల కోసం బంపరాఫర్ ప్రకటించింది. సమ్మర్లో తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే ఇండియన్స్కు 30 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఫ్రాన్స్, టర్కీ, స్పెయిన్, ప్రాగ్, గ్రీస్, వార్సా రూట్లలో ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఈ నెల 28లోగా బుక్ చేసుకున్నవారు ఈ ఏడాది మే 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణించవచ్చని వెల్లడించింది.
News March 26, 2025
ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం ఎగుమతి

TG: ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతి ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొలి విడతగా 12,500 టన్నుల బియ్యాన్ని పంపించనున్నారు. ఈ మేరకు కాకినాడ పోర్టుకు రైస్ చేరింది. రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి నౌక ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. కొద్ది నెలల క్రితం ఆ దేశ ప్రతినిధులతో రైస్ ఎగుమతికి ఒప్పందం జరిగింది. 8లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
News March 26, 2025
BREAKING: మాజీ సీఎం ఇంటిపై సీబీఐ రైడ్స్

లిక్కర్ స్కాం కేసులో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో CBI అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి రాయ్పూర్, బిలాయ్లోని ఆయన ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కాగా ఈనెల 10న బఘేల్ ఇంటిపై ED రైడ్స్ జరిగాయి. ఆ సమయంలో అధికారుల వాహనాలపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు కేంద్రం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బఘేల్ ఆరోపించారు.