News April 5, 2024
కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపిస్తా: కోమటిరెడ్డి
తనపై విమర్శలు చేసిన మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. ‘నా పేరు వాడి అసత్యాలు మాట్లాడారు. కేసీఆర్ కుటుంబ ఆస్తుల చిట్టా బయటపెడతాం. ఆయనకు నిజాం కంటే ఎక్కువ ఆస్తి ఉంది. దోచుకున్న ఆస్తులను ప్రజలకు పంచుతాం. నాపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపిస్తా. రేపు ప్రెస్మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తా’ అని కోమటిరెడ్డి తెలిపారు.
Similar News
News January 23, 2025
నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
AP: అనంతపురం సమీపంలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి చరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఫస్ట్ ఇయర్ చదువుతున్న అతడు క్లాస్ జరుగుతుండగానే బయటికి వచ్చి మూడో అంతస్తు నుంచి దూకేశాడు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. చరణ్ స్వస్థలం రామాపురంగా గుర్తించారు. ఇటీవల సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి వెళ్లిన చరణ్ ఇంతలోనే సూసైడ్ చేసుకోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
News January 23, 2025
BIG NEWS.. రాష్ట్రంలో రూ.60వేల కోట్ల పెట్టుబడులు
దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ సదస్సులో అమెజాన్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం భారీ పెట్టుబడిపై ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్లో రూ.60వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ సంస్థ MOU చేసుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో డేటా సెంటర్లను అమెజాన్ ఏర్పాటు చేయనుంది. అటు నిన్న ఒక్కరోజే రూ.56వేల కోట్లకుపైగా పెట్టుబడులపై పలు సంస్థలతో ప్రభుత్వం <<15232469>>ఒప్పందం <<>>కుదుర్చుకుంది.
News January 23, 2025
ఎయిర్పోర్టులో ఇంత తక్కువ ధరలా!
విమానాశ్రయాల్లోని కేఫ్లలో అధిక ధరలుంటాయన్న విమర్శలున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ యాత్రి కేఫ్లను ఏర్పాటు చేసింది. ఇందులో టీ కేవలం రూ.10, వాటర్ బాటిల్ రూ.10, కాఫీ రూ.20కే విక్రయిస్తున్నారు. తాజాగా కోల్కతాలోని కేఫ్లో ధరలు చూసి ఓ నెటిజన్ షేర్ చేయగా వైరలవుతోంది. కాగా, ఎయిర్పోర్టుల్లో వాటర్ బాటిల్ కూడా రూ.100కు అమ్ముతున్నారని గత నెలలో ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్లో సమస్యను లేవనెత్తారు.