News February 23, 2025

కాంగ్రెస్‌కు శశి థరూర్ రాం రాం చెబుతారా?

image

శశి థరూర్, కాంగ్రెస్ మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇటీవల థరూర్.. మోదీ అమెరికా పర్యటన, కేరళలో పినరయి ప్రభుత్వ పాలనపై ప్రశంసలు కురిపించారు. కేరళలో ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్‌కు కొత్త నాయకత్వం కావాలని, లేదంటే మరోసారి విపక్ష స్థానానికే పరిమితం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి తన సేవలు అవసరం లేదనుకుంటే తనకు ‘ఆప్షన్లు’ ఉన్నాయని వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది.

Similar News

News January 5, 2026

USలో తెలుగు యువతి హత్య.. ఇండియాలో నిందితుడి అరెస్ట్?

image

USలోని మేరీల్యాండ్‌లో తెలుగు యువతి నిఖిత గొడిశాల(27) హత్యకు గురైన కేసులో నిందితుడు అర్జున్ శర్మ అరెస్ట్ అయినట్లు ఇండియా టుడే వెల్లడించింది. ఆ కథనాల ప్రకారం.. ఇంటర్‌పోల్ సాయంతో అతణ్ని తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 31న కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. నిఖిత కనిపించడం లేదని జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేసిన అర్జున్ అదే రోజు తెలివిగా ఇండియాకు పారిపోయివచ్చాడు.

News January 5, 2026

సీమ ద్రోహి ఎవరో తెలిసే ప్రజలు తీర్పిచ్చారు: అచ్చెన్న

image

AP: నదీజలాల అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. రాష్ట్రాల మధ్య సంబంధాలు వేరు.. హక్కులు వేరని వ్యాఖ్యానించారు. హక్కుల విషయంలో ఏమాత్రం తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. 2020లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిందని ఆరోపించారు. రాయలసీమ ద్రోహి ఎవరో తెలిసే ప్రజలు కూటమికి పట్టం కట్టారన్నారు.

News January 5, 2026

J&K మొత్తం ఇండియాలోనే ఉండాలి: బాబ్ బ్లాక్‌మన్

image

POK సహా J&K అంతా ఇండియాలోనే ఉండాలని బ్రిటన్ MP బాబ్ బ్లాక్‌మన్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో భారత్‌కు అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని జైపూర్లోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌ సభలో పిలుపునిచ్చారు. ఆర్టికల్ 370ని తొలగించాలని 1992లోనే చెప్పానన్నారు. కశ్మీరీ పండితులను అక్కడి నుంచి వెళ్లగొట్టడాన్ని వ్యతిరేకించానని గుర్తుచేశారు. మతం పేరిట ప్రజలను వెళ్లగొట్టడం అన్యాయమని ప్రపంచానికి తెలిపానన్నారు.