News March 17, 2024

రాజోలులో మరోసారి జనసేన జెండా ఎగరేసేనా..?

image

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ 814 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఇది రాష్ట్రంలో 2వ అత్యల్ప మెజారిటీ. కొద్ది రోజులకే రాపాక YCPలో చేరగా.. తాజాగా MP సీటు దక్కించుకున్నారు. దీంతో రాజోలులో జనసేన నుంచి దేవా వరప్రసాద్‌ MLA బరిలో ఉన్నారు. YCP నుంచి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు బరిలో ఉన్నారు. మరి జనసేన మరోసారి జెండా ఎగరేసేనా..?

Similar News

News February 1, 2026

గ్రూప్-1లో ముప్పవరం కెరటం.. రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంక్!

image

నిడదవోలు మండలం డి.ముప్పవరం గ్రామానికి చెందిన మారుతి సుధా శ్రీ రమణి ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంక్ సాధించి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్(ACST)గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగదేవి, నాగిరెడ్డి సత్తిపండు, గ్రామ నాయకులు ఆమెను సత్కరించారు. ప్రతిభతో గ్రామానికి కీర్తి తెచ్చిన రమణిని గ్రామస్థులు అభినందనలతో ముంచెత్తారు.

News February 1, 2026

క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలు: మంత్రి కందుల

image

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మంత్రి కందుల దుర్గేశ్ శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జోలికొస్తే సహించేది లేదని, తాట తీస్తామని హెచ్చరించారు. అంబటి ఒక ఆంబోతులా ప్రవర్తిస్తూ నీచమైన మాటలు మాట్లాడుతున్నారని, ఇలాగే కొనసాగితే ప్రజలే బుద్ధి చెబుతారని మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం మానుకోవాలని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో హితవు పలికారు.

News February 1, 2026

క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలు: మంత్రి కందుల

image

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మంత్రి కందుల దుర్గేశ్ శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జోలికొస్తే సహించేది లేదని, తాట తీస్తామని హెచ్చరించారు. అంబటి ఒక ఆంబోతులా ప్రవర్తిస్తూ నీచమైన మాటలు మాట్లాడుతున్నారని, ఇలాగే కొనసాగితే ప్రజలే బుద్ధి చెబుతారని మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం మానుకోవాలని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో హితవు పలికారు.