News March 23, 2024
ఈసారి పోలింగ్ 75% దాటుతుందా?

లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో 67.40%తో ఆల్ టైమ్ హై నమోదైంది. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం 75% దాటాలని రాజకీయ వర్గాలు ఆశిస్తున్నాయి. జమ్మూకశ్మీర్ మినహా ఇతర ప్రాంతాల్లో 2014తో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగింది. J&Kలో 2014లో 49.72% నమోదు కాగా 2019లో అది 29.39%కు పరిమితమైంది. కాగా 1951లో జరిగిన తొలి ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎంతో తెలుసా? 45.67శాతం.
Similar News
News November 26, 2025
తుఫాను ముప్పు తప్పింది.. అల్పపీడనం దూసుకొస్తోంది

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన సెన్యార్ తుఫాను ఇండోనేషియా వైపు పయనిస్తోంది. దీంతో రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పిందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపారు. ఇది క్రమంగా వాయుగుండంగా బలపడి ఈ నెల 29న తమిళనాడు వద్ద తీరం దాటుతుందని అంచనా వేశారు. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
News November 26, 2025
హనుమాన్ చాలీసా భావం – 21

రామ దువారే తుమ రఖవారే |
హోత న ఆజ్ఞా బిను పైఠారే ||
శ్రీరాముని సన్నిధికి ఆంజనేయస్వామి ద్వారపాలకుడిగా ఉంటాడు. ఆయన అనుమతి లేకుండా శ్రీరాముని చెంతకు ఎవరూ చేరలేరు. ఆ శ్రీరాముడు మనల్ని చల్లగా చూడాలంటే హనుమంతుడి అనుగ్రహం కూడా తప్పనిసరి. రామయ్యకు అత్యంత ప్రీతిపాత్రుడైన, శక్తిమంతుడైన భక్తుడు హనుమంతుని పూజిస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది. త్వరగా మోక్షం లభిస్తుంది. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 26, 2025
బిడ్డకు జన్మనిచ్చిన ‘బ్లూడ్రమ్’ ముస్కాన్.. DNA టెస్టుకు డిమాండ్

UP మీరట్లో ప్రియుడితో కలిసి భర్తను చంపి బ్లూడ్రమ్లో పాతేసిన <<16560833>>ముస్కాన్<<>> తాజాగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. భర్త సౌరభ్ పుట్టినరోజునే(NOV 24) బిడ్డ పుట్టడం గమనార్హం. దీంతో ఆ చిన్నారికి DNA టెస్టు నిర్వహించాలంటూ మృతుడి సోదరుడు రాహుల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పెద్ద కూతురు విషయంలోనూ అతను పిల్ వేయగా తీర్పు వెలువడలేదు. వారిద్దరూ సౌరభ్ పిల్లలుగా తేలితే తామే పోషిస్తామని అతను చెబుతున్నాడు.


