News March 23, 2024
ఈసారి పోలింగ్ 75% దాటుతుందా?
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో 67.40%తో ఆల్ టైమ్ హై నమోదైంది. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం 75% దాటాలని రాజకీయ వర్గాలు ఆశిస్తున్నాయి. జమ్మూకశ్మీర్ మినహా ఇతర ప్రాంతాల్లో 2014తో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగింది. J&Kలో 2014లో 49.72% నమోదు కాగా 2019లో అది 29.39%కు పరిమితమైంది. కాగా 1951లో జరిగిన తొలి ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎంతో తెలుసా? 45.67శాతం.
Similar News
News October 2, 2024
మంత్రి కొండా సురేఖకు ప్రకాశ్ రాజ్ కౌంటర్
TG: మంత్రి కొండా సురేఖకు నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ‘ఏంటీ సిగ్గులేని రాజకీయాలు? సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే అంత చిన్న చూపా? జస్ట్ ఆస్కింగ్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. సురేఖ మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేశారు. కాగా నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణమని సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే. అలాగే చాలామంది హీరోయిన్లకు ఆయన డ్రగ్స్ అలవాటు చేశారని ఆమె వ్యాఖ్యానించారు.
News October 2, 2024
గాజాతో CEASE FIRE ఔట్ ఆఫ్ క్వశ్చన్: డిఫెన్స్ ఎక్స్పర్ట్
వెస్ట్ ఏషియాలో యుద్ధం బహుముఖంగా మారిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ యోసి కుపర్వాసర్ అన్నారు. ఈ టైమ్లో గాజాతో సీజ్ ఫైర్, టూ స్టేట్ సొల్యూషన్పై చర్చలు జరిగే ప్రసక్తే లేదన్నారు. ప్రస్తుతం గాజా, లెబనాన్లో నాయకత్వ మార్పు పైనే ఇజ్రాయెల్ దృష్టి సారించిందని తెలిపారు. ఈ వివాదానికి అసలైన పరిష్కారం కోసం ఇరాన్ను తిరిగి రియలిస్టిక్ సైజుకు తీసుకురావడం, ఆ ప్రజల లివింగ్ స్టాండర్ట్స్ పెంచాల్సి ఉందన్నారు.
News October 2, 2024
రైల్వేట్రాక్ను పేల్చేసిన దుండగులు
ఝార్ఖండ్లో దుండగులు రెచ్చిపోయారు. సాహిబ్గంజ్ జిల్లా రంగాగుట్టు గ్రామం వద్ద రైల్వేట్రాక్పై పేలుడు పదార్థాలు అమర్చి పేల్చేశారు. దీంతో ట్రాక్పై మూడడుగుల గొయ్యి పడింది. ట్రాక్ పరికరాలు సుమారు 40 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.