News January 28, 2025

సనాతన్ పరిరక్షణ బోర్డు వచ్చేనా!

image

మహా కుంభమేళా జరుగుతున్న వేళ ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’పై మళ్లీ చర్చ మొదలైంది. నిన్న ప్రయాగ్‌రాజ్‌లో నాగ, వివిధ అఖాడాల సాధువులతో HM అమిత్‌షా సుదీర్ఘంగా చర్చించారు. వారు సనాతన్ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిసింది. అలాగే ఆలయాలు, దేవుడి మాన్యాలు, ఆస్తులను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలని కోరారు. గతంలో పవన్ కళ్యాణ్‌ సైతం ఇదే డిమాండ్ చేశారు. మరి కేంద్రం ఈ మొర ఆలకించేనా? మీ కామెంట్.

Similar News

News February 19, 2025

ఓటీటీలోకి వచ్చేసిన కొత్త మూవీ

image

బాలీవుడ్‌లో హీరోయిన్ కీర్తి సురేశ్ నటించిన తొలి చిత్రం ‘బేబీజాన్’ ఉచిత స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు రెంట్ పద్ధతితో ఉండగా నేటి నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆకట్టుకోలేకపోయింది. సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. కాగా ఈ మూవీ తమిళ చిత్రం విజయ్ ‘తేరి’కి రీమేక్ కావడం గమనార్హం.

News February 19, 2025

హైఅలర్ట్.. సరిహద్దుల్లో మరోసారి అలజడి

image

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో కూంబింగ్ చేపట్టారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవల పలు ఎన్‌కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

News February 19, 2025

చరిత్రలోనే పెద్ద మోసం: మస్క్

image

అమెరికా సామాజిక భద్రతా విభాగంలో డేటాబేస్ పూర్తిగా తప్పని, ‘చరిత్రలోనే ఇది పెద్ద మోసమని’ మస్క్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 100సంవత్సరాల పైబడినవారు 2కోట్లమంది, 200ఏళ్లు దాటిన వారు 2వేలమంది. 369 సంవత్సరాల వ్యక్తి జీవించి ఉన్నట్లు డేటాబేస్ ఉందని తెలిపారు. మరణించిన వారి సమాచారం (SSA)లో నమోదు చేయకపోవడంతో ఈసమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. జనాభా లెక్కల ప్రకారం 100ఏళ్లు దాటిన వారు 86వేలు ఉన్నట్లు తెలిపారు.

error: Content is protected !!