News November 16, 2024
టాయిలెట్నూ మోదీకే రిజర్వ్ చేస్తారా: ఖర్గే

ఎయిర్పోర్ట్ లాంజ్లోకి తనను అనుమతించకపోవడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అసహనం చెందారు. తమ నేత రాహుల్గాంధీకీ నిన్న ఇలాగే జరిగిందన్నారు. తమ ఇద్దరికీ క్యాబినెట్ హోదా ఉందన్నారు. టాయిలెట్నూ PM మోదీకే రిజర్వు చేస్తారా అని ప్రశ్నించారు. ఏ ఎయిర్పోర్టులో అడ్డుకున్నారో మాత్రం ఆయన చెప్పలేదు. నేడు ఖర్గే, HM అమిత్షా ఝార్ఖండ్లో పర్యటిస్తున్నారు. షా వస్తున్నారనే తనను అడ్డుకున్నట్టు ఖర్గే ఆరోపణ.
Similar News
News July 11, 2025
జురెల్ బ్యాటింగ్ చేయవచ్చా?

రిషభ్ పంత్ గాయంపై ఇంకా అప్డేట్ రాలేదు. ఒకవేళ ఆయన తిరిగి ఆటలోకి రాకుంటే టీమ్ ఇండియా 10 మంది బ్యాటర్లతోనే ఆడాల్సి ఉంటుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం సబ్స్టిట్యూట్ ప్లేయర్ బౌలింగ్, బ్యాటింగ్ చేయలేడు. అంపైర్ అనుమతితో కీపింగ్ మాత్రమే చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. కేవలం కంకషన్ (తలకు గాయం) అయితేనే సబ్స్టిట్యూట్ ప్లేయర్ బ్యాటింగ్/బౌలింగ్ చేయగలడు. కానీ పంత్ వేలికి గాయంతో జురెల్ వచ్చారు.
News July 11, 2025
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: ఉత్తమ్

TG: సీఎం రేవంత్ చేతుల మీదుగా ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. దాదాపు 5 లక్షల కొత్త కార్డులు ఇస్తున్నామని చెప్పారు. కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎప్పుడైనా తెల్ల రేషన్ కార్డులిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.13వేల కోట్లతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామన్నారు.
News July 11, 2025
ఒక్క MLA అయినా రైతులను పరామర్శించాడా?: పేర్ని నాని

AP: చంద్రబాబు ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. మామిడి కొనుగోళ్లపై మంత్రులు అధికారులు తలో మాట చెబుతున్నారని ఆరోపించారు. ‘మామిడి, పొగాకు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఒక్క ఎమ్మెల్యే అయినా వారిని పరామర్శించారా? రైతులను పరామర్శించడానికి జగన్ వెళ్తుంటే అడ్డుకుంటారా? కొంతమందికి కూలీ ఇచ్చి మరీ జగన్ను తిట్టిస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.