News March 29, 2024
ఈ టీమ్ ట్రోఫీ గెలుస్తుందా?
జూన్లో పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును BCCI త్వరలోనే ప్రకటించనుంది. ప్లేయర్ల ఎంపికపై సెలక్టర్లు కసరత్తు చేస్తున్నారు. వరల్డ్ కప్లో బరిలోకి దిగే భారత ప్రాబబుల్-11ను తాజాగా Sportstar ప్రకటించింది. రోహిత్, జైస్వాల్, కోహ్లీ, సూర్య, రింకూ, హార్దిక్, జురెల్, జడేజా, అక్షర్, బుమ్రా, సిరాజ్ ఆ టీమ్లో ఉన్నారు. ఈ జట్టు ట్రోఫీ గెలుస్తుందని భావిస్తున్నారా? కామెంట్ చేయండి..
Similar News
News January 16, 2025
ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు: KTR
TG: ఫార్ములా-ఈ కేసులో ED విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో KTR ట్వీట్ చేశారు. ‘HYDలో ఈ ఈవెంట్ నిర్వహించినప్పుడు ఇతరులు మన నగరాన్ని ప్రశంసిస్తుంటే గర్వంగా అనిపించింది. HYD బ్రాండ్ను పెంచడమే నాకు ముఖ్యం. FEOకి ₹46cr బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశాం. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు. రాజకీయ కుట్రతో కేసు పెట్టారు. త్వరలోనే నిజం బయటకు వస్తుంది. మా పోరాటాన్ని కొనసాగిస్తాం’ అని పేర్కొన్నారు.
News January 16, 2025
KL రాహుల్, శాంసన్కు షాక్?
ఛాంపియన్స్ ట్రోఫీలో WKలుగా KL రాహుల్, శాంసన్కు ఛాన్స్ దక్కకపోవచ్చని వార్తలొస్తున్నాయి. రాహుల్ను స్పెషలిస్ట్ WKగా ఆడించేందుకు సెలక్టర్లు ఆసక్తిగా లేరని, VHTలో ఆడకపోవడంతో శాంసన్ ఈ ఛాన్స్ కోల్పోయినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. WK స్థానానికి పంత్, జురెల్ ఎంపికవ్వొచ్చని అంచనా వేసింది. రానున్న రోజుల్లో శాంసన్ T20ల్లో, పంత్&జురెల్ టెస్ట్, ODIల్లో కొనసాగుతారని తెలిపింది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది.
News January 16, 2025
హిండెన్బర్గ్ను ఇప్పుడే ఎందుకు మూసేసినట్టు!
US షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ షట్డౌన్ టైమింగ్పై చాలామందికి డౌట్ వస్తోంది. JAN 20న ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తారు. కొన్ని రోజుల క్రితమే హౌస్ జుడీషియరీ కమిటీలోని రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడొకరు అదానీ, అతడి కంపెనీలపై కమ్యూనికేషన్, దర్యాప్తు పత్రాలు, ఆధారాలన్నీ పరిరక్షించాలని DOJను కోరారు. ఇక హిండెన్బర్గ్కు డీప్స్టేట్, డెమోక్రాట్స్, జార్జ్ సొరోస్, చైనా ఇంటెలిజెన్స్ సహకారంపై ఆరోపణలు ఉన్నాయి.