News August 22, 2024
త్వరలో ఇక్రిశాట్ క్యాంపస్ను సందర్శిస్తా: సీఎం రేవంత్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1724333224003-normal-WIFI.webp)
TG: వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలపై పరిశోధనలను ముమ్మరం చేయాలని ఇక్రిశాట్ సంస్థకు CM రేవంత్ సూచించారు. ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డా.జాక్వెలిన్ హ్యూ ఇవాళ ఆయనతో భేటీ అయ్యారు. ఇక్రిశాట్ క్యాంపస్ను సందర్శించాలని ఆమె కోరగా, త్వరలోనే సందర్శిస్తానని CM తెలిపారు. ఇక్రిశాట్ సేవలను మరింత విస్తృతం చేయడం ద్వారా వ్యవసాయ రంగానికి మరింత మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
Similar News
News February 13, 2025
సీఎం రేవంత్ను గద్దె దించే ప్రయత్నం.. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739438204944_1226-normal-WIFI.webp)
TG: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలే సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీని కోసం 25 మంది పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని చెప్పారు. మరోవైపు ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
News February 13, 2025
గ్రూప్-2 హాల్టికెట్లు విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739438209837_81-normal-WIFI.webp)
APలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ OTPR ID, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి హాల్టికెట్లు పొందవచ్చు. ఈ నెల 23న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు కేటాయించారు. హాల్టికెట్ల కోసం ఇక్కడ <
News February 13, 2025
మంత్రి సురేఖపై పరువునష్టం దావా.. విచారణ 27కు వాయిదా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739011911707_1032-normal-WIFI.webp)
TG: నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు సురేఖ ఇప్పటికే క్షమాపణ చెప్పారని ఆమె తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. అయితే మీడియా ముఖంగా ఆమె చేసిన విమర్శలకు, కోర్టుకు సమర్పించిన వివరాలకు పొంతన లేదని నాగార్జున తరఫు లాయర్ పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.