News April 11, 2024

లక్షన్నర మెజార్టీతో గెలుస్తా : మాధవీలత

image

TG: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంకు మద్దతుగా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికే వ్యతిరేకమని దుయ్యబట్టారు. రజాకార్లకు తోడుగా ఉండే వారంతా తన ప్రత్యర్థులేనన్నారు. రాబోయే ఎన్నికల్లో తనదే విజయమని.. ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్‌పై లక్షన్నర ఓట్ల మెజార్టీతో గెలుస్తానని జోస్యం చెప్పారు.

Similar News

News December 9, 2025

ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలకు రామ్మోహన్ నాయుడు ఆదేశాలు

image

దేశంలోని మేజర్ ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు చేసి ఎయిర్‌లైన్ ఫంక్షనింగ్, ప్రయాణికుల సమస్యలు తెలుసుకోవాలని అధికారులను సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. ప్రయాణికులతో నేరుగా మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని చెప్పారు. డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్, జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై సహా మేజర్ ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు నిర్వహించనున్నారు.

News December 9, 2025

విజయ్‌ సభకు తుపాకీతో వచ్చిన వ్యక్తి!

image

కరూర్ తొక్కిసలాట తర్వాత TVK చీఫ్‌, నటుడు విజయ్ తొలిసారి ప్రజల మధ్యకు వస్తున్నారు. నేడు పుదుచ్చేరిలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పాలంలోని ఎక్స్‌పో గ్రౌండ్‌లో అధికారులు భద్రతా పరంగా భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ఓ వ్యక్తి తుపాకీతో ప్రవేశించేందుకు యత్నిస్తూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. అతడు శివగంగై జిల్లా టీవీకే కార్యదర్శి ప్రభుకు గార్డుగా పనిచేసే డేవిడ్‌గా గుర్తించారు.

News December 9, 2025

బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్?

image

బ్లాక్‌బస్టర్ మూవీ ‘3 ఇడియట్స్’కు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని చర్చ జరుగుతోంది. ఈ సినిమాలోని మెయిన్ క్యారెక్టర్స్ 15 ఏళ్ల తర్వాత కలుసుకుంటే ఏం జరుగుతుందనే పాయింట్‌తో తెరకెక్కనుందని సమాచారం. రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన ‘3 ఇడియట్స్’లో ఆమిర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు.