News April 11, 2024
లక్షన్నర మెజార్టీతో గెలుస్తా : మాధవీలత

TG: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంకు మద్దతుగా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికే వ్యతిరేకమని దుయ్యబట్టారు. రజాకార్లకు తోడుగా ఉండే వారంతా తన ప్రత్యర్థులేనన్నారు. రాబోయే ఎన్నికల్లో తనదే విజయమని.. ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్పై లక్షన్నర ఓట్ల మెజార్టీతో గెలుస్తానని జోస్యం చెప్పారు.
Similar News
News January 14, 2026
173 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (<
News January 14, 2026
నేడే జ్యోతి దర్శనం.. కిక్కిరిసిన శబరిగిరులు

అయ్యప్ప స్వాముల 41 రోజుల కఠిన దీక్షకు ఇవాళ సార్థకత లభించనుంది. సాయంత్రం శబరిగిరుల్లో మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. 6.25-6.55 గంటల మధ్య పొన్నాంబల కొండపై జ్యోతి కనిపించనుంది. సాక్షాత్తు మణికంఠుడే జ్యోతి రూపంలో దర్శనమిస్తారని స్వాముల ప్రగాఢ విశ్వాసం. దీంతో ఈ దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు మాలధారులు శబరిమలకు పోటెత్తారు. ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.
News January 14, 2026
‘మన శంకరవరప్రసాద్ గారు’ 2 డేస్ కలెక్షన్లు ఎంతంటే?

చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో సంక్రాంతికి వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ భారీ కలెక్షన్లు రాబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల్లో రూ.120కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. తొలి రోజు ప్రీమియర్స్తో కలిపి రూ.84కోట్లు సాధించిన విషయం తెలిసిందే. మూవీకి పాజిటివ్ టాక్ రావడం, పండుగ సెలవుల నేపథ్యంలో ఈ వారం కలెక్షన్లు భారీగా పెరిగే ఛాన్సుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.


