News July 1, 2024
నేటి నుంచి వింబుల్డన్
ప్రతిష్ఠాత్మక టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సారి ఫేవరెట్గా సెర్బియా ప్లేయర్ జకోవిచ్ ఉన్నారు. ఆయనకు టాప్ సీడ్ సినర్, మూడో ర్యాంకర్ అల్కరాస్ నుంచి పోటీ నెలకొంది. మరోవైపు గాయం కారణంగా నాదల్ ఈ టోర్నీ నుంచి తప్పుకున్నారు. మహిళల సింగిల్స్లో స్వైటెక్, సబలెంక, సకారి టైటిల్ రేసులో ఉన్నారు. భారత్ ప్లేయర్ సుమిత్ తొలి రౌండ్లో సెర్బియా ఆటగాడు కెక్మనోవిచ్తో తలపడనున్నారు.
Similar News
News September 21, 2024
రేపు జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే
AP: ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేనలో చేరనున్నారు. రేపు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు గుంటూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు కూడా జనసేనలో జాయిన్ కానున్నారు. కిలారి రోశయ్య 2019లో పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
News September 21, 2024
మోదీ పర్యటనకు ముందు ఖలిస్థానీలతో US NSA మీటింగ్
చరిత్రలో తొలిసారి సిక్కు యాక్టివిస్టులు, వేర్పాటువాదుల(ఖలిస్థానీ)తో అమెరికా NSA సమావేశం అయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ముంగిట వైట్హౌస్ అధికారులు వారిని కలవడం గమనార్హం. అమెరికా గడ్డపై విదేశీ దూకుడు చర్యల నుంచి రక్షిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు సిక్కు నేత ప్రిత్పాల్ సింగ్ అన్నారు. ‘నిరంతర నిఘాతో సిక్కుల ప్రాణాల్ని కాపాడిన ఫెడరల్ గవర్నమెంటుకు థాంక్స్’ అని ఆయన ట్వీట్ చేశారు.
News September 21, 2024
ఏపీలో ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపు
Jr.NTR ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. మల్టీప్లెక్స్లో ఒక్కో టికెట్పై రూ.135 వరకూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్పై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్పై రూ.60 వరకూ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అలాగే రిలీజ్ రోజున(SEP 27) 12AM నుంచి మొత్తం 6షోలు, 28వ తేదీ నుంచి 9 రోజులపాటు రోజుకు 5షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.