News March 13, 2025

రేపు వైన్స్ బంద్

image

హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో రేపు(14న) మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూసివేయాలని పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రోడ్డుపై వెళ్లే వారిపై రంగులు చల్లొద్దని, గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని పోలీసులు ఆదేశించారు.

Similar News

News March 20, 2025

గన్ లైసెన్స్ ఇవ్వండి: రాజాసింగ్

image

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని బుల్లెట్ ప్రూప్ వెహికిల్, సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్లొద్దని సూచించారు. అయితే గోషామహల్ నియోజకవర్గంలో ఇరుకైన రోడ్లు ఉంటాయని అందులో బుల్లెట్ ప్రూప్ వెహికిల్ తిరగలేదని రాజాసింగ్ అన్నారు. భద్రత కోసం తనకు గన్ లైసెన్స్ ఇవ్వాలని ఎమ్మెల్యే పోలీసులను కోరారు.

News March 20, 2025

తను నిజమైన వర్కింగ్ ఉమెన్: ప్రియాంక చోప్రా

image

ప్రియాంక చోప్రాకు జరిగిన ఒక ఆసక్తికర సంఘటనని ఇన్‌స్టాలో షేర్ చేశారు. తను వైజాగ్ ఎయిర్ పోర్ట్ వెళ్తున్న సమయంలో రోడ్డుపై తనకెంతో ఇష్టమైన జామ పండ్లు కనిపించాయట వాటి ఖరీదు రూ.150 అయితే ప్రియాంక రూ.200 ఇచ్చి ఉంచుకోమని చెప్పిందట, అప్పుడు పండ్లు అమ్మె మహిళ మిగిలిన డబ్బులకు సరిపడేలా కొన్ని పండ్లు ఇచ్చి వెళ్లిందట. తను నిజమైన వర్కింగ్ ఉమెన్ అని నా మనసు గెలిచిందని ప్రియాంక ఇన్‌స్టాలో షేర్ చేశారు.

News March 20, 2025

కుంభమేళాలో 1,000 మంది భక్తుల మిస్సింగ్: అఖిలేశ్ యాదవ్

image

ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో మిస్సయిన 1,000మంది భక్తుల జాడ కనుక్కోవడంలో ఉత్తరప్రదేశ్ సర్కార్ విఫలమైందని ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో తప్పిపోయిన వారి పోస్టర్లు ఉన్నాయన్నారు. యూపీ, MP ప్రభుత్వాలు కలిసి వెహికిల్ పార్కింగ్ ఏర్పాట్లు మాత్రమే చేశాయని దుయ్యబట్టారు. కుంభమేళా ఏర్పాట్లకు కేంద్రం ఎన్ని నిధులు కేటాయించిందో తెలపాలని అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.

error: Content is protected !!