News February 6, 2025
WNP: బైక్, లారీ ఢీ.. ఒకరి దుర్మరణం
బైక్ని లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పాన్గల్ మండలం రేమొద్దులకి చెందిన నర్సింహారెడ్డి(55) తన సొంత పనుల మీద బైక్పై విలియంకొండకు వచ్చారు. తిరిగి ఇంటికెళ్తుండగా.. కొత్తకోట మదర్థెరిసా జంక్షన్ వద్ద ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. కేసు నమోదైంది.
Similar News
News February 6, 2025
సంపన్నులకు దోచిపెట్టేలా కేంద్ర బడ్జెట్: ఏఐటీయూసీ, సీఐటీయూ
సంపన్నులకు దోచిపెట్టేలా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉందని వరంగల్ జిల్లా ఏఐటీయూసీ, సీఐటీయూ కార్యదర్శులు ముక్కెర రామస్వామి, గన్నారం రమేష్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం వరంగల్ చౌరస్తాలో నిరసన చేపట్టి బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. బడ్జెట్ కార్మికులు, కర్షకులు, ప్రజలకు వ్యతిరేకంగా ఉందన్నారు.
News February 6, 2025
విజయవాడ: గోల్కొండ, ప్యాసింజర్ రైలు రద్దు
ఈనెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గోల్కొండ, డోర్నకల్ ప్యాసింజర్ రైలు రద్దు చేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించారు. దీంతో 17202, సికింద్రాబాద్ నుంచి గుంటూరు, 17201 గుంటూరు నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే గోల్కొండ ఎక్స్ప్రెస్, 67767 డోర్నకల్ నుంచి విజయవాడ వెళ్లే ప్యాసింజర్, 67768 విజయవాడ నుంచి డోర్నకల్ వెళ్లే ప్యాసింజర్ రద్దు కానున్నాయి.
News February 6, 2025
బుమ్రా గాయంపై రోహిత్ UPDATE
స్టార్ పేసర్ బుమ్రా గాయంపై కెప్టెన్ రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతనికి 2 రోజులు స్కాన్స్ జరగాల్సి ఉందన్నారు. అందులో వచ్చిన రిజల్ట్స్ను బట్టి ఇంగ్లండ్తో మూడో వన్డే, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటంపై క్లారిటీ వస్తుందని ప్రెస్మీట్లో చెప్పారు. వెన్నులో వాపు కారణంగా బుమ్రా NCAలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ENGతో ODI సిరీస్కు అతని స్థానంలో వరుణ్ను BCCI ఎంపిక చేసింది.