News June 13, 2024

తుపాకీ చప్పుడుతో నిద్ర లేచా: సల్మాన్

image

తన ఇంటి ముందు కాల్పుల ఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హీరో సల్మాన్ ఖాన్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఆరోజు ఉదయం తుపాకీ చప్పుడుతో తాను నిద్ర లేచినట్లు ఆయన చెప్పారు. సల్మాన్ సోదరుడు అర్బాజ్ స్టేట్‌మెంట్‌నూ తీసుకున్నారు. కాగా APR 14న సల్మాన్ ఇంటి ముందు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ <<13052619>>కాల్పులు<<>> జరిపింది. ఈకేసులో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేయగా ఒకరు పోలీస్ కస్టడీలోనే ఉరేసుకొని చనిపోయాడు.

Similar News

News March 22, 2025

IPL-2025: డూడుల్ మార్చిన గూగుల్

image

అతిపెద్ద ఫ్రాంచైజ్ క్రికెట్ పండుగ IPL ఈ రోజు ప్రారంభం కానుండటంతో ‘గూగుల్’ ప్రత్యేక డూడుల్‌ని ఆవిష్కరించింది. డూడుల్‌ను క్రికెట్ పిచ్‌గా మార్చేసి, రెండు డక్స్ ఆడుతున్నట్లు చూపించింది. కాగా, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈరోజు KKR, RCB మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ జట్ల మధ్య ఇప్పటివరకు 34 మ్యాచులు జరగ్గా KKR 20, RCB 14 మ్యాచ్‌లు గెలిచాయి. నేటి మ్యాచ్‌లో గెలుపెవరిది అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 22, 2025

ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం

image

డీలిమిటేషన్‌పై చెన్నైలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేరళ సీఎం విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పంజాబ్ సీఎం మాన్ తదితరులు హాజరయ్యారు. వారిని స్టాలిన్ సత్కరించారు. సమావేశానికి బెంగాల్ సీఎం మమత గైర్హాజరయ్యారు.

News March 22, 2025

రేషన్ షాపుల్లో సన్నబియ్యం.. UPDATE

image

TG: పేదలకు రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి వేదిక ఖరారైంది. ఉగాది రోజున సూర్యాపేటలోని మట్టపల్లి ఆలయం నుంచి ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీని ద్వారా 2 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు 6కేజీల చొప్పున సన్నబియ్యం అందుకోనున్నారు. కాగా ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వనున్నారు.

error: Content is protected !!